తరచూ చోరీలకు పాల్పడుతున్న తిరువర్ప్ అజీ(48)ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో కొల్లం బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన దొంగతనంలో నిందితుడిగా అజీను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. అజయన్ చెప్పిన విషయాలు విని అవ్వాక్కవటం పోలీసుల వంతైంది.
28 ఏళ్లు జైలులోనే...
అజీ తన 48ఏళ్ల జీవితంలో 28 సంవత్సరాలు జైలులోనే గడిపాడు. నాలుగేళ్ల క్రితమే అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ నాలుగేళ్లలో దాదాపు వందకు పైగా చోరీలకు పాల్పడ్డాడు. దొంగతనాల్లో అజీ కొత్త విధానాలను అవలంబిస్తాడు. ఇళ్లల్లో చోరీ చేయకుండా కేవలం దుకాణాల్లోనే దొంగతనాలు చేస్తుంటాడు. ఈ మధ్యకాలంలో పాఠశాలల్లో దొంగతనాలు మొదలుపెట్టాడు. ఎర్నాకులం, కొల్లం, కొట్టాయం మొదలుగు ప్రాంతాల్లో ఎక్కువగా చోరీలు చేస్తున్నాడు.