తెలంగాణ

telangana

By

Published : Feb 11, 2022, 11:39 AM IST

ETV Bharat / bharat

వెయ్యికిపైగా చోరీలు.. 28 ఏళ్ల జైలు జీవితం.. మళ్లీ అరెస్ట్​

అతడు ఒక గజదొంగ. 48 ఏళ్ల జీవితంలో 28 సంవత్సరాలు జైలులోనే గడిపాడు. నాలుగేళ్ల క్రితమే విడుదలయ్యాడు. అయినా బుద్ధి మారలేదు. మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈ సారి పాఠశాలలో చోరీ చేశాడు. సీసీటీవీ ఫుటేజ్​ల ఆధారంగా పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. విచారణలో విస్తుపోయిన నిజాలు చెప్పి పోలీసులను షాక్​కు గురి చేశాడు.

notorious thief
గజదొంగ

తరచూ చోరీలకు పాల్పడుతున్న తిరువర్ప్ అజీ(48)​ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో కొల్లం బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన దొంగతనంలో నిందితుడిగా అజీ​ను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్​కు తరలించారు. అజయన్​ చెప్పిన విషయాలు విని అవ్వాక్కవటం పోలీసుల వంతైంది.

28 ఏళ్లు జైలులోనే...

అజీ​ తన 48ఏళ్ల జీవితంలో 28 సంవత్సరాలు జైలులోనే గడిపాడు. నాలుగేళ్ల క్రితమే అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ నాలుగేళ్లలో దాదాపు వందకు పైగా చోరీలకు పాల్పడ్డాడు. దొంగతనాల్లో అజీ కొత్త విధానాలను అవలంబిస్తాడు. ఇళ్లల్లో చోరీ చేయకుండా కేవలం దుకాణాల్లోనే దొంగతనాలు చేస్తుంటాడు. ఈ మధ్యకాలంలో పాఠశాలల్లో దొంగతనాలు మొదలుపెట్టాడు. ఎర్నాకులం, కొల్లం, కొట్టాయం మొదలుగు ప్రాంతాల్లో ఎక్కువగా చోరీలు చేస్తున్నాడు.

సీసీటీవీ ఫుటేజ్​ల ఆధారంగా...

గత నెలలో కొల్లం పశ్చిమ బాలికల ఉన్నత పాఠశాల కార్యాలయం తలుపును పగలగొట్టి... లోపల ఉన్న సొమ్మును అపహరించాడు అజీ. పాఠశాలలో ఉన్న సీసీటీవీ కెమెరాలను సైతం ధ్వంసం చేశాడు. అయితే దొంగలించినప్పుడు సన్నివేశాలు రికార్డు అయినట్టు అజీ గమనించలేదు. వాటి ఆధారంగా జిల్లా సరిహద్దుల్లో తిరుగుతున్న అజీని అరెస్ట్​ చేశారు పోలీసులు.

ఇదీ చదవండి: అడవికి వెళ్లి గిరిజన యువకుడు అదృశ్యం.. చివరకు!

ABOUT THE AUTHOR

...view details