తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో 58లక్షల మందికి వ్యాక్సినేషన్

భారత్​లో కరోనా టీకా తీసుకున్నవారి సంఖ్య 58లక్షలు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్ తొలివిడతలో భాగంగా కరోనాను ముందుండి పోరాడిన వైద్య, ఆరోగ్య సిబ్బందికి టీకా అందిస్తున్నారు.

By

Published : Feb 8, 2021, 5:15 AM IST

More than 58 lakh healthcare, frontline workers vaccinated against COVID-19 across India: Govt
భారత్​లో 58 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్

దేశంలో వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు అధికారులు. ఆదివారం సాయంత్రం నాటికి 58,03,617మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలకు టీకా అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క ఆదివారమే 28,059 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందికి వ్యాక్సిన్ అందించిన మూడో దేశంగా ప్రస్తుతం భారత్ ఉంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రిటన్​లు ఉన్నాయి.

ఇదీ చదవండి :మరో 7 కొవిడ్​ టీకాలు సిద్ధమవుతున్నాయి: కేంద్రం

ABOUT THE AUTHOR

...view details