తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గంగా, హిమాలయాలను మోదీ కాపాడతారు'

గంగా నది, హిమాలయాలను ప్రధాని మోదీ కాపాడతారని వ్యాఖ్యానించారు భాజపా నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి. మోదీ ఓ అతీంద్రియ నేత అని అన్నారు.

By

Published : May 19, 2021, 7:06 AM IST

Updated : May 19, 2021, 7:12 AM IST

BJP leader
ఉమా భారతి, భాజపా నాయకురాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ గొప్ప నాయకుడు అని కొనియాడారు భాజపా నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి. గంగానది, హిమాలయాలను మోదీ కాపాడతారని అన్నారు. బిహార్, ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రాల్లోని గంగానదిలో మృతదేహాలు తేలుతున్న నేపథ్యంలో ఉమాభారతి వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉమా భారతి ట్వీట్
ఉమా భారతి ట్వీట్

"2014 జూన్ నుంచి 2016 జులై వరకు నా శరీరంలో ప్రవహించింది రక్తం కాదు.. గంగా నది. ఆ రోజుల్లో గంగానే నా సర్వస్వం. 2016 జులై-అక్టోబర్ మధ్యకాలంలో గంగా అభివృద్ధి పనులు చేపట్టాం. ఆ నదికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించే మార్గం కనుగొన్నాం. యమునా, సరస్వతి ఇతర నదులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేశాం. ప్రధాని మోదీపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన అతీంద్రియ నేత. గంగా నదితో పాటు హిమాలయాలనూ కాపాడతారు."

-ఉమా భారతి, భాజపా నేత

కేబినెట్​లో కొనసాగాలని ప్రధాని మోదీ, అమిత్ షా తనను కోరారని ఉమా భారతి పేర్కొన్నారు. కానీ గంగా నది సమీపంలోని సాధువులను కలిసేందుకు ప్రస్తుతం సమయం వెచ్చిస్తున్నట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:జులైలో సీబీఎస్‌ఈ 'పది' ఫలితాలు

Last Updated : May 19, 2021, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details