తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Modi Sunak Bilateral Talks : రిషి సునాక్​తో మోదీ ద్వైపాక్షిక చర్చలు.. బైడెన్​తో బంగ్లా ప్రధాని సెల్ఫీ - జపాన్​ ప్రధానితో మోదీ ద్వైపాక్షిక చర్చలు

Modi Sunak Bilateral Talks : దిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భందా ప్రధాని నరేంద్ర మోదీ.. యూకే ప్రధాని రిషి సునాక్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంపై వీరు చర్చించారు. ఆ తర్వాత జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదాతో కూడా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

Modi Sunak Bilateral Talks
Modi Sunak Bilateral Talks

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 4:54 PM IST

Updated : Sep 9, 2023, 9:21 PM IST

Modi Sunak Bilateral Talks : దిల్లీలో రెండు రోజులపాటు జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్​కు వచ్చిన బ్రిటన్​ ప్రధాని రిషి సునాక్​తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంతో పాటు వాణిజ్య సంబంధాలపై వీరు చర్చించారు.

Rishi Sunak India Visit : సునాక్​తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన తర్వాత ప్రధాని మోదీ ఎక్స్(ట్విట్టర్​)లో ఫొటోలను పోస్ట్ చేశారు. "జీ20 సదస్సు సందర్భంగా దిల్లీకి వచ్చిన బ్రిటన్​ ప్రధాని రిషి సునాక్​ను కలవడం చాలా గొప్ప విషయం. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పెంచేందుకు మేం చర్చించాం. సంపన్నమైన ప్రపంచం కోసం భారత్​, బ్రిటన్​ నిరంతరం కృషి చేస్తాయి" అని ట్వీట్​ చేశారు.

జపాన్​ ప్రధానితో మోదీ ద్వైపాక్షిక చర్చలు..
Japan PM Modi Bilateral Talks : జపాన్​ ప్రధాని ఫుమియో కిషిదాతో కూడా ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కనెక్టివిటీ, వాణిజ్యంతో పాటు ఇతర రంగాల్లో సహకారం పెంపొందించుకోవడానికి భారత్, జపాన్ ఆసక్తిగా ఉన్నాయని మోదీ తెలిపారు. "జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో ఫలప్రదమైన చర్చ జరిగింది. భారత జీ20 అధ్యక్షత, జపాన్​ జీ7 ప్రెసిడెన్సీతోపాటు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించాం" అని మోదీ ట్వీట్​ చేశారు.

ఇటలీ ప్రధానితో మోదీ ద్వైపాక్షిక చర్చలు..
Italy PM Modi Bilateral Talks : ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కూడా ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ జీవ ఇంధన కూటమి, భారత్​- పశ్చిమాసి కారిడార్​లో భాగస్వామిగా ఇటలీ చేరినందుకు.. మెలోనిని మోదీ ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఇరు దేశాధినేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. "ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో అద్భుతమైన సమావేశం జరిగింది. వాణిజ్యం, రక్షణ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు పలు రంగాల్లో సహకారం గురించి చర్చించాం. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్​, ఇటలీ కలిసి పని చేస్తాయి" అని మోదీ ట్వీట్ చేశారు.

బైడెన్‌తో బంగ్లా ప్రధాని సెల్ఫీ
Biden Bangladesh PM :జీ20 సదస్సు మధ్యలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా కొంతసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోలను బంగ్లాదేశ్ హైకమిషన్‌ తమ సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసింది.

జీ20 డిక్లరేషన్​కు ఏకాభిప్రాయం
G20 Declaration India :అంతకుముందు.. జీ-20 శిఖరాగ్ర సమావేశాల ముగింపు సందర్భంగా విడుదల చేసే సంయుక్త డిక్లరేషన్‌పై నెలకొన్న ప్రతిష్టంభనకు.. భారత్‌ చాకచక్యంగా తెరదించింది. లేకుంటే మొదటిసారి డిక్లరేషన్‌ విడుదల చేయకుండా దిల్లీలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశాలు ముగిసేవి. డిక్లరేషన్‌లో ఉక్రెయిన్‌ సంక్షోభానికి సంబంధించిన పదాలపై ఈనెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకు హరియాణాలోని నుహ్‌లో జరిగిన షేర్పాల సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ డిక్లరేషన్‌లో సవరించిన పేరాగ్రాఫ్‌ను జీ-20 దేశాల ప్రతినిధులకు ఇవాళ పంపిణీ చేశారు. భౌగోళిక రాజకీయ అంశానికి సంబంధించిన పేరా లేకుండా పంపిణీచేసిన ముసాయిదా డిక్లరేషన్‌పై జీ-20 దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. దిల్లీ సమావేశాల సంయుక్త డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదిరినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభ్యుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. డిక్లరేషన్‌ విడుదల కోసం కృషి చేసిన తమ షేర్పాను, మంత్రులను అభినందిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

G20 Summit Modi Speech : 'సబ్​కా సాథ్..​ స్ఫూర్తితో ముందుకెళ్లాలి'.. జీ20 సదస్సులో మోదీ.. ఆఫ్రికాకు శాశ్వత సభ్యత్వం

ప్రపంచం కోసం భారత్.. జీవ ఇంధన కూటమి ఏర్పాటు.. వారందరికీ మోదీ పిలుపు

Last Updated : Sep 9, 2023, 9:21 PM IST

ABOUT THE AUTHOR

...view details