ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇరు దేశాల కృషిపై జపాన్ నూతన ప్రధాని ఫుమియో కిషిడాతో (India Japan Modi) చర్చించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానిగా ఎన్నికైన కిషిడాను అభినందించినట్లు పేర్కొన్నారు. భారత్- జపాన్ల బంధం మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు (India Japan Modi) కృషి చేస్తాయని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు గురువారం మోదీ ట్వీట్ చేశారు.
భారత్- జపాన్ల మధ్య ఉన్న అంతర్జాతీయ భాగస్వామ్యంపై (Modi and Japan Prime Minister) ఇరు దేశల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారని ప్రధాని మంత్రి కార్యాలయం వెల్లడించింది. టెక్నాలజీ సహా భవిష్యత్తులో రాణించే రంగాలపై కృషి చేసేందుకు అంగీకరించినట్లు తెలిపింది.