అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్-జో బైడన్లో ఎవరు ఎన్నికైనా.. వాణిజ్యం, భద్రతలో భారత్తో అగ్రరాజ్యానికి ఉన్న బంధం మారదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ్ బారు పేర్కొన్నారు. ఒకవేళ డెమొక్రాట్లు శ్వేతసౌధానికి చేరితే మాత్రం.. భారత్లోని మైనారిటీల హక్కులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురుస్తుందని ఈటీవీ-భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
"ట్రంప్ గెలిస్తే అంతా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ప్రధాని మోదీ, విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ ట్రంప్తో బంధాన్ని బలపరుచుకునేందుకు చాలా సమయం కేటాయించారు. అయితే డెమొక్రాట్లు గెలిస్తే మాత్రం కష్టమే. భారత్లో మోదీ ప్రభుత్వం పనితీరుపై వారు అసంతృప్తితో ఉన్నారు. మానవ హక్కులు, మైనారిటీలతో వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తారు. మనం వాటికి సమాధానమివ్వాల్సి ఉంటుంది."