ఎమ్మెల్యేగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ రాణేకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిపై ప్రతాప్ సింగ్కు ఉన్న అంకితభావం ఆయన పనిలో ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.
50 ఏళ్లుగా ఎమ్మెల్యే- మోదీ అభినందనలు - modi congratulates goa ex-cm
గోవా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ రాణేకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యేగా ఆయన 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందున మోదీ ట్విట్టర్ వేదికగా అభినందించారు.

గోవా మాజీ సీఎంకు ప్రధాని అభినందనలు
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గోవా అసెంబ్లీ కూడా ప్రతాప్ సింగ్కు అభినందనలు తెలిపింది. తొలిరోజు ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టింది.
ఇదీ చదవండి :'మృతులలో 88 శాతం మంది వారే'