ఇటీవల భాజపాలో చేరిన బాలీవుడ్ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మిథున్ చక్రవర్తికి కేంద్రం వీఐపీ భద్రతను కల్పించనుంది. ఆయనకు వై ప్లస్ కేటగిరీ రక్షణను అందించనుంది. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో వై ప్లస్ రక్షణతో పాటు సీఐఎస్ఎఫ్ కమాండోలు కూడా మిథున్ వెంట ఉంటారని స్పష్టం చేశారు.
మిథున్ చక్రవర్తికి 'వై ప్లస్' భద్రత - బంగాల్ ఎన్నికలు
మిథున్ చక్రవర్తికి కేంద్రం వీఐపీ భద్రతను కల్పించనుంది. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. భద్రత సంస్థల సూచన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
![మిథున్ చక్రవర్తికి 'వై ప్లస్' భద్రత mithun](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10956904-thumbnail-3x2-mithun.jpg)
మిథున్ చక్రవర్తికి వీఐపీ భద్రత
భద్రత సంస్థల సూచనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఝార్ఖండ్ భాజపా ఎంపీ నిశికాంత్ దుబెకు కూడా కేంద్రం ఇదే తరహా భద్రతను కల్పించనుంది. దీంతో దేశవ్యాప్తంగా సీఐఎస్ఎఫ్ రక్షణ పొందుతున్న వారి సంఖ్య 104కి చేరింది.
ఇదీ చదవండి :మిథున్ 'చక్రం'.. భాజపా కొత్త అస్త్రం!