తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంచాయతీ ఎన్నికల్లో మిస్​ ఇండియా ఫైనలిస్ట్​ ఓటమి - యూపీ ఎన్నికల్లో దీక్షా సింగ్ ఓటమి

యూపీ పంచాయతీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న మిస్​ ఇండియా రన్నరప్​ దీక్షా సింగ్​ ఓటమి పాలయ్యారు. కేవలం 2వేల ఓట్లు దక్కించుకుని ఐదో స్థానంలో నిలిచారు.

Diksha Singh, Miss India finalist loses UP Panchayat polls
దీక్ష సింగ్

By

Published : May 4, 2021, 3:05 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన మిస్​ ఇండియా ఫైనలిస్ట్​​ దీక్షా సింగ్​ ఓటమి చవిచూశారు. జౌన్​పుర్​ జిల్లా బక్షాలో బరిలో నిలిచిన దీక్షా.. 2వేల ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. ఆ ప్రాంతంలో భాజపా మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి నాగినా సింగ్.. ఐదు వేల ఓట్లతో విజయం సాధించారు.

మౌలిక వసతుల లోపం, మహిళల సంక్షేమం అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని దీక్షా సింగ్​ జిల్లా పంచాయతీ సభ్యురాలి పదవి కోసం పోటీ చేశారు.

జౌన్​పుర్ జిల్లా బక్షా ప్రాంతంలోని చిట్టోరీ గ్రామానికి చెందిన దీక్షా బాల్యంలోనే ముంబయికి వలస వచ్చారు. 2015లో ఫెమీనా మిస్​ ఇండియా పోటీల్లో పాల్గొని రన్నరప్​గా నిలిచారు. కొన్ని సినిమాల్లో, వాణిజ్య ప్రకటనల్లో నటించారు. కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ రాయడంలోనూ సహకారం అందించారు.

ఇదీ చదవండి :'బంగాల్​ స్థిరాస్తి చట్టం రాజ్యాంగ విరుద్ధం'

ABOUT THE AUTHOR

...view details