తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Minor Girl Carried Father On Rickshaw : వాహనంలో వెళ్లేందుకు డబ్బులు లేక.. 35కి.మీ రిక్షా తొక్కి తండ్రిని ఆస్పత్రిలో చేర్చిన బాలిక - గాయపడిన తండ్రిని రిక్షాలో తీసుకెళ్లిన బాలిక ఒడిశా

Minor Girl Carried Father On Rickshaw in Odisha : ఆస్పత్రికి వాహనంలో వెళ్లేందుకు స్తోమత లేక గాయపడిని తండ్రిని రిక్షాలో తీసుకెళ్లింది ఓ కుమార్తె. 35 కిలో మీటర్లు తానే స్వయంగా రిక్షా తొక్కుతూ తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఈ హృదయవిదారక ఘటన ఒడిశాలో జరిగింది.

Minor Girl Carried Father On Rickshaw
Minor Girl Carried Father On Rickshaw

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 7:04 AM IST

Updated : Oct 27, 2023, 10:29 AM IST

వాహనంలో వెళ్లేందుకు డబ్బులు లేక.. 35కి.మీ రిక్షా తొక్కి తండ్రిని ఆస్పత్రిలో చేర్చిన బాలిక

Minor Girl Carried Father On Rickshaw in Odisha :గాయపడిన తండ్రిని రిక్షా తొక్కుతూ 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లింది 14 ఏళ్ల కుమార్తె. ఒడిశా.. భద్రక్​ జిల్లాలో అక్టోబర్ 22న జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

ఇదీ జరిగింది..
జిల్లాలోని దుసూరి నడిగావ్ ప్రాంతానికి చెందిన శంభునాథ్​ సేథి అనే వ్యక్తి అక్టోబర్ 22న గాయపడ్డాడు. వాహనంలో ఆస్పత్రికి వెళ్లడానికి డబ్బులు లేక.. అతడి 14 ఏళ్ల కుమార్తె శంభునాథ్​ను రిక్షాపై ధామ్​నగర్​ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అనంతరం అదే రిక్షాపై 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న భద్రక్​ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే శంభునాథ్​కు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. దీంతో చేసేదేమీ లేక రిక్షాలో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఆస్పత్రి నుంచి రెండు కిలో మీటర్లు ప్రయాణించాక.. బాలిక రిక్షా తొక్కడాన్ని కొందరు విలేకరులు గమనించారు. అనంతరం వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న భద్రక్​ ఎమ్మెల్యే, ధామ్​నగర్ మాజీ ఎమ్మెల్యే ఘటనా స్థలికి చేరుకుని.. బాధితుల పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం బాలిక తండ్రి చికిత్సకు, ఆస్పత్రిలో వారి బసకు ఏర్పాట్లు చేశారు.

రిక్షాలో తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న బాలిక

బ్యాగులో కొడుకు మృతదేహం.. అంబులెన్స్​కు డబ్బులు లేక..
ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయి. ఈ ఏడాది మేలో అంబులెన్స్​లో కుమారుడి మృతదేహాన్ని తరలించేందుకు డబ్బులు లేక.. బ్యాగులో పెట్టి బస్సులో ఇంటికి తీసుకెళ్లాడు ఓ వ్యక్తి!. బంగాల్​లోని ఉత్తర దినాజ్​పుర్​ జజిల్లాలోని కలియాగంజ్​ బ్లాక్​ ముస్తఫానగర్​ పంచాయతీలోని దంగీపరా గ్రామానికి చెందిన అషిమ్​ దేబ్​​ ఇద్దరు కుమారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిద్దరినీ కలియాగంజ్​ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడం వల్ల రాయ్​గంజ్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయతించినా చిన్నారుల ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో మెరుగైన చికిత్స కోసం శిలిగుడి బోధనాసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

అంబులెన్స్​ లేక.. ద్విచక్ర వాహనం దిక్కాయె..

Relatives Carried Man Dead Body On Bike : బైక్​పై మృతదేహంతో 10కిమీ ప్రయాణం

Last Updated : Oct 27, 2023, 10:29 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details