తెలంగాణ

telangana

By

Published : Dec 24, 2020, 6:28 PM IST

Updated : Dec 24, 2020, 6:49 PM IST

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో ఎన్​కౌంటర్​ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.

Militant killed in encounter with security forces in J-K's Baramulla
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా బలగాలు. జిల్లాలోని క్రెరీ ప్రాంతంలోని వనిగాం పేయిన్​లో​ ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు.

దీంతో ఎదురుకాల్పులు జరిపిన భద్రతా బలగాలు.. ఇద్దరు తీవ్రవాదులను హతమార్చాయి. అయితే ముష్కరులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనేది ఇంకా తెలియలేదు.

ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:'శాస్త్ర-సాంకేతిక సమాచారం పంచుకునేందుకు సిద్ధం'

Last Updated : Dec 24, 2020, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details