Tremors felt in Karnataka: కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. సుళ్యా తాలుకాలో ఉదయం 9:10 నిమిషాలకు భారీ శబ్దాలతో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. సుమారు 45 సెకన్ల పాటు కంపించినట్లు చెప్పారు. సుళ్యా సహా కల్లుగుండి, సంపాజే, గూండ్కా, అరంతోడు, ఇవర్నాడు, తోడిక్కన ప్రాంతాల్లో ప్రకపంనలు సంభవించాయి.
కర్ణాటకలో భూప్రకంపనలు.. భయంతో వీధుల్లోకి జనం పరుగులు - కర్ణాటక న్యూస్
Tremors felt in Karnataka: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. భారీ శబ్దాలతో భూమి కంపించడం వల్ల అనేక ప్రాంతాల్లో ఇళ్లు బీటలువారాయి.
![కర్ణాటకలో భూప్రకంపనలు.. భయంతో వీధుల్లోకి జనం పరుగులు Tremors felt in Karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15655066-705-15655066-1656153075183.jpg)
దెబ్బతిన్న ఇళ్లు
రిక్టర్ స్కేల్పై 2.4 తీవ్రత నమోదైనట్లు విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. సుళ్యా ప్రాంతాల్లోని అనేక ఇళ్లు బీటలువారాయి. ఆందోళన చెందిన ప్రజలు.. ఇళ్లు వదిలి వీధుల్లోకి పరుగెత్తారు. ప్రకంపనల ధాటికి ఇళ్లలోని వస్తువులన్నీ నేలపై పడిపోయాయి. ఈ ఘటనపై ప్రజలు తమకు సమాచారం అందించారని దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ కేవీ రాజేంద్ర తెలిపారు.
ఇదీ చదవండి:ప్రయాణిస్తుండగానే బైక్లో చెలరేగిన మంటలు.. రైడర్ సజీవదహనం