తెలంగాణ

telangana

By

Published : May 27, 2021, 9:24 PM IST

ETV Bharat / bharat

జూన్ వరకు కొవిడ్ మార్గదర్శకాలు కొనసాగింపు

కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా జూన్ 30 వరకు కొనసాగించాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది కేంద్రం. స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే నిబంధనలు సడలించాలని పేర్కొంది.

home affairs ministry
హోంశాఖ

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్ మార్గదర్శకాలు జూన్ చివరి వరకూ కొనసాగించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. జిల్లా అధికార యంత్రాంగాలు వైరస్​ కట్టడి చర్యలపై దృష్టి సారించాలని పేర్కొంది.

'కఠిన నిబంధనల కారణంగా వైరస్​ సోకే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. కొన్ని ప్రాంతాలు మినహా చాలా చోట్ల మెరుగైన ఫలితం కనిపించింది. అయినప్పటికీ యాక్టివ్ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా కఠిన నిబంధనలు కొనసాగించడం అవసరం' అని హోంశాఖ కార్యదర్శి అజయ భల్లా పేర్కొన్నారు.

స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకునే నిబంధనలు సడలించాలని భల్లా స్పష్టం చేశారు. ఏప్రిల్​ 29 నుంచి ప్రారంభమైన నిబంధనలు జూన్ 30 వరకు కొనసాగించాలన్నారు. అయితే, లాక్​డౌన్​ కొనసాగింపుపై స్పష్టత ఇవ్వలేదు.

రాష్ట్రాల్లో ఆక్సిజన్​ పడకలు, వెంటిలేటర్లు, అంబులెన్స్​ సేవలపై దృష్టి పెట్టాలని కేంద్రం సూచించింది.

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 2 కోట్ల 73 లక్షలు దాటింది. కొత్తగా 2 లక్షల 11 వేల మందికి వైరస్​ సోకింది. రికవరీ రేటు 90 శాతంగా ఉంది.

ఇదీ చదవండి:20 రోజులుగా స్థిరంగా తగ్గుతున్న కరోనా

ABOUT THE AUTHOR

...view details