తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 1:43 PM IST

Updated : Oct 30, 2023, 4:35 PM IST

ETV Bharat / bharat

Maratha Reservation Agitation : రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్యే ఇంటికి నిప్పు- సీఎం వార్నింగ్!

Maratha Reservation Agitation : మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్​లకు అనకూలంగా నిరసనలు చేస్తున్న ఆందోళనకారులు బీడ్‌ జిల్లాలోని ఎన్​సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్​ సోలంకే నివాసానికి నిప్పు పెట్టారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Maratha Reservation Agitation
Maratha Reservation Agitation

Maratha Reservation Agitation :మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లకు అనుకూలంగా జరుగుతున్న నిరసనలు హింసాయుతంగా మారాయి. కొందరు ఆందోళనకారులు సోమవారం బీడ్‌ జిల్లా మజాల్‌గావ్​లోని ఎన్​సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్​ సోలంకే నివాసానికి నిప్పు పెట్టారు. అంతకుముందు గుంపులుగా తరలివచ్చిన నిరసనకారులు ఎమ్మెల్యే ఇంటిపైకి రాళ్లు విసిరారు. అక్కడే బయట పార్క్​ చేసి ఉన్న కార్లకు నిప్పంటించారు.

ఇటీవలే ఎమ్మెల్యే ప్రకాశ్​ సోలంకే మరాఠా రిజర్వేషన్​ల కోసం ఆందోళనలపై, మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్​పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్​గా మారింది. అక్టోబర్​ 24 నాటికి మరాఠా కోటా అమలు చేయాలంటూ ప్రభుత్వానికి 40 రోజులు గడువు ఇవ్వడం ఓ పిల్లల ఆటగా మారిందని సోలంకే మాట్లాడినట్లు ఆడియో క్లిప్​లో ఉందని సమాచారం. దీంతో ఆగ్రహించిన మరాఠీలు స్థానికంగా బంద్​కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ప్రకాశ్​ సోలంకే ఇంటిపైకి దాడికి దిగారు.

తన ఇంటిపై దాడితో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 'మరాఠా రిజర్వేషన్​ కోసం ఆందోళన చేస్తున్న నిరసనకారులు బీడ్‌లోని మా ఇంటిపై దాడికి దిగి నిప్పంటించారు. ఆ సమయంలో నేను, నా కుటుంబ సభ్యులు, సిబ్బంది ఇంట్లోనే ఉన్నాం. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది' అని ఎన్​సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్​ సోలంకే ట్వీట్​ చేశారు.

సీఎం రియాక్షన్​..
ఎన్​సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్​ సోలంకే నివాసంపై మరాఠా రిజర్వేషన్ అనుకూల నిరసనకారులు దాడి చేయడంపై స్పందించారు మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​ శిందే. 'ఈ ఆందోళనలు ఏ మలుపు తిరుగుతాయో, ఎక్కడికి దారితీస్తాయో మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ గమనించాలి. మీరు చేసే నిరసనలు తప్పు దిశగా సాగుతున్నాయి.' అని శిందే ట్విట్టర్​ వేదికగా సూచించారు.

'ట్రిపుల్​ ఇంజిన్​ సర్కార్​దే బాధ్యత..'
మరాఠా రిజర్వేషన్ల నిరసనలపై స్పందించిన ఎన్​సీపీ ఎంపీ సుప్రియా సూలే.. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర హోం మంత్రి, హోం మంత్రిత్వ శాఖ, ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. 'మహారాష్ట్రలోని ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలకు ఏక్​నాథ్​ శిందే నేతృత్వంలోని ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. మరాఠా, ధన్‌గర్, లింగాయత్, ముస్లిం వర్గాలను బీజేపీ మోసం చేస్తోంది' అని సుప్రియా సూలే వ్యాఖ్యానించారు.

Death of Former BJP MPs Son : వైద్యుల నిర్లక్ష్యంతో బీజేపీ మాజీ ఎంపీ కొడుకు మృతి!.. ICU బెడ్లు లేక గంటపాటు అవస్థ

Kerala Blast Bomb : 'యూట్యూబ్​ చూసి బాంబుల తయారీ.. సాక్ష్యం కోసం స్వయంగా వీడియోగ్రఫీ'.. కేరళ బ్లాస్ట్ కేసులో షాకింగ్ నిజాలు

Last Updated : Oct 30, 2023, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details