ప్రసవ సమయంలో గుండెపోటుతో మరణించింది ఓ కొవిడ్ రోగి. మరోవైపు.. పుడుతూనే పాల కోసం ఏడుస్తోంది ఆమెకు జన్మించిన చిన్నారి. ఆ చిన్నారి ఆకలి బాధను చూడలేక.. కృష్ణుడిని పెంచిన యశోదలా ఎందరో తల్లులు ముందుకువచ్చారు. బ్రెస్ట్ఫీడింగ్ చేస్తూ దయాహృదయం చాటుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్పుర్లో జరిగింది.
ఇదీ జరిగింది..
నాగ్పుర్కు చెందిన మీనల్ వెర్నెకర్కు, ఠాణెకు చెందిన చేతన్తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇరువురూ ఠాణెలో నివసిస్తున్నారు. అయితే.. గర్భవతి అయ్యాక డెలివరీ నిమిత్తం మీనల్ నాగ్పుర్లోని తన అమ్మవాళ్లింటికి వెళ్లింది. ఎనిమిదో నెల రాగానే మీనల్కు కరోనా సోకింది. వెంటనే కింగ్స్వే ఆసుపత్రిలో చేర్పించారు ఆమె తల్లితండ్రులు.