తెలంగాణ

telangana

ముందస్తు బెయిల్​ కోసం కోర్టుకు సచిన్​ వాజే

ముందస్తు బెయిల్​ కోసం ఠాణె కోర్టును ఆశ్రయించారు సచిన్​ వాజే. అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలు లభించిన కారు యజమాని మన్​సుఖ్​ హిరేన్​ మృతి కేసులో ఆయన​ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

By

Published : Mar 13, 2021, 10:22 AM IST

Published : Mar 13, 2021, 10:22 AM IST

Sachin Vaze moves Thane court for anticipatory bail application
ముందస్తు బెయిల్​ కోసం కోర్టుకు సచిన్​ వాజే

హిరేన్​ మృతికేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి క్రైమ్ బ్రాంచ్​ అసిస్టెంట్​ పోలీస్​ ఇన్​స్పెక్టర్ సచిన్​ వాజే.. కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్​ కోసం ఠాణె జిల్లా & సెషన్స్​ కోర్టులో అప్పీల్​ చేసుకున్నారు.

శుక్రవారమే ఈ అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం.. ఆయనకు ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణను మార్చి 19కి వాయిదా వేసింది.

బదిలీ..

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు లభించిన కారు యజమాని హిరేన్​ మన్​సుఖ్.. మార్చి 5న అనుమానస్పద స్థితిలో మరణించారు. ఈ కేసులోనే.. కేసు దర్యాప్తు చేస్తున్న వాజేపై ఆరోపణలు వచ్చాయి.

అనంతరం.. సచిన్​ను నేర నిఘా విభాగం(సీఐయూ) నుంచి సిటిజెన్​ ఫెసిలిటేషన్​ సెంటర్(సీఎఫ్​సీ) విభాగానికి బదిలీ చేశారు.

ఇదీ చూడండి: 'ఆ కారు యజమాని హిరేన్ కాదు.. న్యూటన్​'

ABOUT THE AUTHOR

...view details