పాకిస్థాన్ జైళ్లో ఎనిమిదేళ్ల శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని ఓ భారతీయుడు ఇటీవల విడుదలయ్యాడు. కాన్పూర్కు చెందిన షామ్సుద్దిన్ అనే వ్యక్తి.. కరాచీ జైలు నుంచి విడుదలై ఆదివారం సాయంత్రం తన ఇంటికి చేరుకున్నాడు.
జైలు నుంచి విడుదలైన తర్వాత షామ్సుద్దిన్ తొలుత అమృత్సర్ క్వారెంటైన్ సెంటర్లో ఉన్నాడు. అన్ని రకాల అధికారిక ప్రక్రియలు పూర్తైన తరవాత అతన్ని ఇంటికి పంపించారు పోలీసులు. జైలు శిక్షతో కలిపి పాకిస్థాన్ నుంచి 28 ఏళ్ల తర్వాత షామ్సుద్దిన్ ఇంటికు చేరుకున్న నేపథ్యంలో..అతని కుటుంబ సభ్యులు సంబురాలు జరుపుకున్నారు.
ఇంటి నుంచి వెళ్లిపోయి.. పాక్లో నివాసం..
1992లో షామ్సుద్దిన్ తన తండ్రితో గొడవపడి దిల్లీకి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి సౌదీ వెళ్లాలనుకున్నాడు కానీ.. తనకు తెలిసిన ఓ వ్యక్తి వల్ల పాకిస్థాన్కు చేరుకున్నాడు.
90రోజుల వీసాతో పాకిస్థాన్కు వెళ్లిన షామ్సుద్దిన్. అంతర్గత అల్లర్ల కారణంగా వీసా ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో వీసా అప్డేట్ కోసం ప్రయత్నిస్తే పోలీసులు అరెస్టు చేయొచ్చని స్నేహితులు సలహా ఇచ్చారు.