తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 11:01 AM IST

Updated : Sep 1, 2023, 12:22 PM IST

ETV Bharat / bharat

Man Shot Dead In Union Minister Home : కేంద్ర మంత్రి ఇంట్లో యువకుడి డెడ్​ బాడీ.. తనయుడిపైనే అనుమానం!

Man Shot Dead In Union Minister Home : కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్​ నివాసంలో ఓ యువకుడి మృతదేహాం కలకలం రేపింది. ఆ మంత్రి కుమారుడే యువకుడ్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది.

Man Shot Dead In Union Minister Home
Man Shot Dead In Union Minister Home

Man Shot Dead In Union Minister Home :కేంద్రమంత్రి కౌశల్‌ కిశోర్ ఇంట్లో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. కేంద్ర మంత్రి తనయుడి తుపాకితో యువకుడిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోని మంత్రి నివాసంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఫరీదీపుర్​లోని మాధవపుర్​ వార్డుకు చెందిన వినయ్ శ్రీవాస్తవ అనే యువకుడు, మంత్రి కౌశల్ కిశోర్ కుమారుడు వికాస్​ స్నేహితులు. అయితే వీరిద్దరు గురువారం సాయంత్రం తమ స్నేహితులు అజయ్, రావత్, అంకిత్ వర్మ, షమీమ్, బాబాతో పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో తలెత్తిన గొడవలో కాల్పులు జరిగాయి. దీంతో శ్రీవాస్తవ మృతిచెందాడు. ఈ హత్యకు గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. నలుగురు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలిలో వికాస్​ పేరుతో ఉన్న లైసెన్స్డ్​ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వినయ్​ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. హత్య ఎవరు చేశారు? హత్యకు దారితీసిన కారణాలేవి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నా కుమారుడు దిల్లీలో ఉన్నాడు : మంత్రి
ఈ హత్య గురించి తెలుసుకున్న మంత్రి కౌశల్ కిశోర్..​ కమిషనర్​కు సమాచారం అందించారు. పోలీసు విచారణలో ఈ హత్య గురించి నిజానిజాలు వెల్లడవుతాయని మంత్రి అన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో తాను లేనని చెప్పారు. అయితే, తన కుమారుడు కూడా ఘటనాస్థలిలో లేడని.. అనారోగ్యంగా ఉన్న కారణంగా దిల్లీలో ఉన్నాడని తెలిపారు.

అప్పట్లో రైతులపై దాడి.. ఇప్పుడు హత్య : కాంగ్రెస్
ఈ ఘటనపై కాంగ్రెస్​ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'ప్రధాని మోదీకి ఒక మంత్రి ఉన్నారు- కౌశల్​ కిశోర్. ఆయన ఇల్లు లఖ్​నవూలో ఉంది. ఈరోజు మంత్రి ఇంట్లో రక్తం మడుగులో యువకుడి మృతదేహాం లభ్యమైంది. అతడిని ఎవరో కాల్చి చంపారు. ఘటనాస్థలిలో లభ్యమైన పిస్టల్​​ మంత్రి కుమారుడిది. గతంలో మరో మంత్రి కుమారుడు రైతులపై దాడి చేయడం చూశారు. ఇప్పుడు మరో మంత్రి ఇంట్లో హత్య జరిగింది. ప్రధాని మోదీ కావాలనే అలాంటి వాళ్లను ఎంపిక చేసుకున్నారు' అని ఎక్స్​లో మండిపడింది.

కేంద్రమంత్రి కుమారుడిపై హత్య, హత్యాయత్నం కేసు

Lakhimpur Kheri News: 'కారుతో తొక్కించి.. కాల్పులు జరిపి'

Last Updated : Sep 1, 2023, 12:22 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details