భార్య జ్ఞాపకాలతో ఇల్లు- కూల్చకుండా ఏకంగా ఇంటినే తరలిస్తున్న భర్త! ఎక్కడంటే? Man Relocated His House : జమ్ముకు చెందిన ఓ వ్యాపారి తన భార్య జ్ఞాపకాలను పదిలంగా ఉంచేందుకు అరుదైన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం తన ఇల్లు ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం వల్ల ఏకంగా ఇంటినే వేరో చోటుకు తరలిస్తున్నారు. రూ. 50లక్షల వ్యయంతో హరియాణాకు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు.
"ప్రశ్న : ఇంటిని తరలించాల్సిన అవసరమేంటి?
జవాబు:"ఈ ఇంటిని తరలించడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి రోడ్డు విస్తరణలో భాగంగా స్థలాన్ని ప్రభుత్వ స్వాధీనం చేసుకుంది. రెండోది తన భార్యకు జ్ఞాపకార్థం ఇల్లు కూల్చివేయడం యజమానికి ఇష్టం లేదు"
- ధూమ్ సింగ్, సూపర్ వైజర్
రోజుకు అలా..
ఇంటిని తరలించే ప్రక్రియలో భాగంగా ఇనుప కడ్డీలు, హైడ్రాలిక్ జాక్లను అమర్చారు. ఆ తర్వాత రోజుకు 2-3 అడుగుల మేరకు ఇంటిని ఎత్తుతూ మరో చోటుకు తరలిస్తారు.
"భవనాన్ని తరలించే ప్రాజెక్ట్లో మొత్తం 20 మంది పనిచేస్తున్నారు. ఇప్పటికే ఇంటిని ఎనిమిది అడుగురు పైకి ఎత్తారు. ట్రాక్ల ద్వారా ఇంటిని తరలిస్తాం
ప్రశ్న: మీరు భవనాన్ని ఎంత దూరం తరలిస్తున్నారు?
జవాబు : 160 అడుగులు. తరలించడానికి సుమారు మూడు నుంచి నాలుగు నెలలు పడుతుంది"
- ధూమ్ సింగ్, సూపర్ వైజర్
దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఇలాంటి టెక్నాలిజీని ఉపయోగించినప్పటికీ జమ్ములో మాత్రం ఇదే తొలిసారి అని స్థానికులు తెలిపారు.
కొన్నాళ్ల క్రితం పంజాబ్లో ఇలాంటి సంఘటన జరిగింది. రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభత్వం తన ఇంటిని కూల్చేస్తుందని తెలుసుకున్న వ్యక్తి ఏకంగా ఇంటినే 500 అడుగులు వెనక్కి జరిపించారు. తద్వారా కలల సౌధంపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఆ ఇల్లు తన కలలకు ప్రతిరూపమని చెప్పారు. తనకు మరో ఇల్లు కట్టుకోవడం ఇష్టం లేదని అందువల్లే ఈ విధంగా చేశానని ఆ రైతు వెల్లడించారు. ఈయన కట్టుకున్న రెండంతస్తుల ఇల్లు సంగ్రూర్ పట్టణ సమీపంలోని రోషన్వాలా గ్రామంలో ఉంది. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్పై క్లిక్ చేయండి.