తెలంగాణ

telangana

కోర్టు ఆవరణలో కాల్పులు.. తూటా ఇరుక్కుపోయి..​!

By

Published : Dec 17, 2021, 6:45 AM IST

Shooting In Court Complex: కోర్టు ఆవరణలోనే హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడుపై కాల్పులు జరిపాడు ఓ వ్యక్తి. తుపాకీ పేలినా.. బులెట్​ గన్​లోనే ఇరుక్కుపోవడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్​లోని ధోల్​పుర్​ సెషన్స్​ కోర్ట్లో జరిగింది.

Firing in Dholpur Court Complex
కోర్టు ఆవరణలో కాల్పులు

Shooting In Court Complex: రాజస్థాన్‌లోని ధోల్‌పుర్ సెషన్స్ కోర్టు ఆవరణలో హత్య కేసు నిందితుడిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. నాటు తుపాకీ కావడం వల్ల తూటా బయటకి రాకపోవటం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇదీ జరిగింది..

నిహాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొలారీలో నివసించే దివాన్​ సింగ్​ అనే వ్యక్తి 5 సంవత్సరాల క్రితం ధోల్‌పుర్‌కు చెందిన సంజు బాల్మీకిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే బెయిల్‌పై విడుదలై విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యాడు. కొన్ని రోజులుగా అతనికి చంపుతామని బెదిరింపులు కూడా వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే చనిపోయిన వ్యక్తి సోదరుడు అశోక్‌తో పాటు మరో ఆరుగురు గురువారం కోర్టుకు వచ్చారు. దివాన్‌సింగ్​పై అశోక్​ కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఇరుక్కుపోయి తుపాకీ పేలకపోవడం వల్ల దివాన్ సింగ్​ వారి నుంచి తప్పించుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. నిందితులు వెంటనే అక్కడి నుంచి పరారైనట్లు పేర్కొన్నారు.

అక్కడే ఉన్న ధోల్​పుర్ జడ్జి రీటా తేజ్​పాల్​ దివాన్​ సింగ్​పై జరిగిన దాడి గురించి తెలుసుకున్నారు. పరారైన నిందితులను పట్టుకోవాలని ఎస్పీని ఆదేశించారు. నిహల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌ సిబ్బంది కేసు నమోదు చేసి.. నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

దివాన్​ సింగ్​ పేరు మోసిన రౌడీ షీటర్​ అని పోలీసులు పేర్కొన్నారు. అతని పై ఇప్పటికే ఆరు కేసులు ఉన్నట్లు గుర్తు చేశారు.

ఇదీ చూడండి:Medical Student killed: కారు ఢీకొని వైద్య విద్యార్థిని మృతి

ABOUT THE AUTHOR

...view details