రాజస్థాన్ కోటాలో దారుణం జరిగింది. భార్యను గొడ్డలితో నరికి హత్యచేశాడు పింటూ అలియాస్ సునీల్ వాల్మీకి(40) అనే వ్యక్తి. అక్కడితో ఆగకుండా.. వీధిలోకి కొంతదూరం లాక్కెళ్లి స్థానికుల్లో భయాందోళనలు సృష్టించాడు. కాసేపటికి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ ఘటనలో గాయపడ్డ.. 9 నెలల కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
భఠ్పాడా ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.