తెలంగాణ

telangana

By

Published : Jan 8, 2021, 6:40 PM IST

ETV Bharat / bharat

తల్లి, చెల్లిపైకి ట్రాక్టర్​ ఎక్కించి.. ఇనుప రాడ్​తో కొట్టి..

కుటుంబ కలహాలతో తల్లి, చెల్లిపైకి ట్రాక్టర్​ని ఎక్కించి హతమార్చాడో మూర్ఖుడు. ఆపై ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టాడు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Man Kills Mother, Sister for the reason of family Strife
తల్లిని, చెల్లిపైకి ట్రాక్టర్​ ఎక్కించి మరీ..

కన్నతల్లిని, తన సోదరిని అతి కిరాతకంగా హతమార్చాడో దుర్మార్గుడు. కర్ణాటకలోని దావణగెరె జిల్లా యెక్కెగుండి గ్రామానికి చెందిన భరామె గౌడ తన తల్లి సరోజమ్మ, చెల్లి జ్యోతితో కలిసి నివసిస్తున్నాడు.

కుటుంబంలో వచ్చిన చిన్న తగాదాను మనసులో పెట్టుకున్న నిందితుడు.. వారిపైకి ట్రాక్టర్​ ఎక్కించాడని.. అంతటితో ఆగక వారిని ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టి చంపాడని గామస్థులు తెలిపారు. ప్రాథమిక వివరాలను సేకరించిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.

తల్లి, చెల్లిపైకి ట్రాక్టర్​ ఎక్కించి మరీ..
ట్రాక్టర్​ ఎక్కించగా మృతి చెందిన తల్లి, చెల్లి
ట్రాక్టర్​ బీభత్సంలో చెల్లాచెదురైన జీవితాలు

ఇదీ చదవండి:గుడిలో 40 ఏళ్ల మహిళపై గ్యాంగ్​ రెేప్​

ABOUT THE AUTHOR

...view details