తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డ్రైవర్​గా తీసేయమన్నందుకు.. యజమాని భార్యను.. - యజమాని భార్యను చంపిన ఉద్యోగి

డబ్బులు ఎక్కువగా అడుగుతున్నాడని, డ్రైవర్​ను ఉద్యోగం నుంచి తీసేయమని భర్తకు చెప్పింది ఓ మహిళ. దీనిపై ఆ డ్రైవర్​ కోపం పెంచుకున్నాడు. ఎవరూ లేని సమయం చూసి.. ఆమెపై దాడి చేసి చంపాడు. ఆపై కరెంట్​ షాక్​ పెట్టాడు. ఈ ఘటన దిల్లీలోని బురారీ ప్రాంతంలో జరిగింది.

Man held in Delhi's Burari for killing ex-employer's wife after losing job
ఉద్యోగం నుంచి తీసేయమంటే.. ప్రాణం తీశాడు

By

Published : Nov 10, 2021, 9:08 AM IST

Updated : Nov 10, 2021, 11:07 AM IST

ఉద్యోగం నుంచి తీసేసి, ఇంటి నుంచి పంపించేయాలని భర్తకు చెప్పిందనే కోపంతో తన యజమాని భార్యను గొంతు నులిమి హత్య చేశాడు వారి కారు డ్రైవర్​. ఆ తర్వాత ఆమెకు కరెంట్​ షాక్​ పెట్టాడు. ఈ దారుణ ఘటన దిల్లీలోని బురారీ ప్రాంతంలో జరిగింది.

ఇదీ జరిగింది..

దిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్​గా పని చేస్తున్న వీరేందర్​ కుమార్​కు మూడేళ్ల క్రితం రాకేశ్​ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలోనే అతనికి డ్రైవర్​గా ఉద్యోగం ఇచ్చారు కుమార్​. తన ఇంటిపై పెంట్​ హౌజ్​లో ఉండేందుకు చోటు కల్పించాడు. కొద్ది రోజులుగా డ్రైవర్​కు జీతం చెల్లించటంలో ఆలస్యం చేశారు. సుమారు రూ.3 లక్షల వరకు చెల్లించాలని, పూర్తిగా ఒకేసారి ఇవ్వాలని రాకేశ్​ డిమాండ్​ చేశాడు. ఇందుకు నిరాకరించిన యజమాని భార్య పంకీ.. అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని భర్తకు చెప్పింది. ఇంటి నుంచి పంపించేయాలని కోరింది. ఈ విషయంపై కోపం పెంచుకున్నాడు రాకేశ్​.

వీరేందర్ తన తల్లితో కలిసి ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుసుకుని గత సోమవారం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. వీరేందర్​ భార్య పింకీపై దాడి చేశాడు. గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై విద్యుత్​ షాక్​కు గురి చేశాడు. అనంతరం.. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐపీసీ సెక్షన్​ 302 ప్రకారం అతనిపై కేసు నమోదు చేసిట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:యూపీలో జికా విజృంభణ.. 100 దాటిన కేసులు

Last Updated : Nov 10, 2021, 11:07 AM IST

ABOUT THE AUTHOR

...view details