తెలంగాణ

telangana

సుపారీ ఇచ్చి తండ్రిని హత్య చేయించిన కూతురు.. ఎందుకు అలా చేసిందంటే?

రాజస్థాన్​లో దారుణం జరిగింది. తండ్రినే హత్య చేయించింది ఓ కూతురు. ఇందుకోసం రూ.50,000 సుపారీ ఇచ్చింది. పబ్​జీకి బానిసైన 18 ఏళ్లు యువకుడు ఆరేళ్ల బాలుడిని చంపేసిన కేసు.. కీలక మలుపు తిరిగింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

By

Published : Jul 8, 2022, 5:47 PM IST

Published : Jul 8, 2022, 5:47 PM IST

sanskar murder case in deoria
హత్య

కన్న తండ్రినే హత్య చేయించింది ఓ కుమార్తె. ఈ ఘటన రాజస్థాన్​లోని కోటలో జరిగింది. ఈ కేసులో మృతుడి కుమార్తె శివాని మీనా, ఆమె ప్రియుడు అతుల్ మీనా, లలిత్ మీనా, విష్ణు భీల్, విజయ్ మాలి అనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే:రాజేంద్ర మీనా(47) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈయన బిస్లాయ్ అనే గ్రామంలో నివసిస్తున్నాడు. రాజేంద్రకు ఇద్దరు భార్యలు. అతడు మద్యానికి కావడం వల్ల.. అప్పులు ఎక్కువయ్యాయి. దీంతో సుల్తాన్​పుర్​లోని తన మొదటి భార్య కోసం ఇంటిని అమ్మాలని అనుకున్నాడు. ఇల్లు అమ్మడం నచ్చని.. అతని కూతురు.. తండ్రి హత్యకు ప్రణాళిక వేసింది. రూ.50,000 సుపారీ ఇచ్చి.. తండ్రిని హత్య చేయించింది. జూన్​ 25న బైక్​ మీద వస్తుండగా.. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో దాడి చేసి రాజేంద్రను హతమార్చారు. రాజేంద్ర తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా.. కుమార్తే సూత్రదారి అన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులను అరెస్టు చేశారు.

పబ్​జీకి బానిసై:రెండు రోజుల క్రితం హత్యకు గురైన బాలుడి కేసులో పురోగతి లభించింది. పబ్​జీకి బానిసైన కోచింగ్ సెంటర్ యజమాని మనవడు అరుణ్ శర్మ(18) హత్య చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. పబ్​జీ వద్దంటున్న తన తాత, అమ్మమ్మను జైలుకు పంపేందుకు అతను ఇలా చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని దేవరియాలో జరిగింది.

జరిగింది ఇదీ..: లార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్ఖోలి గ్రామానికి చెందిన బాలుడు సంస్కార్ యాదవ్ (6).. ప్రతి రోజు ఉదయం కోచింగ్ సెంటర్​కు వెళ్లేవాడు. బుధవారం కూడా అలా వెళ్లిన సంస్కార్​ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో అతని తండ్రి, కుటుంబ సభ్యులు వెతికారు. ఎక్కడా కనిపించక పోవడం వల్ల కోచింగ్ సెంటర్​కు వెళ్లి ఆరా తీశారు. ఆ రోజు కోచింగ్ సెంటర్​ రాలేదని వారికి తెలిసింది. సాయంత్రం సమయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు ఓ లేఖ అందింది. రూ.5 లక్షలు సిద్ధం చేసుకోవాలని.. లేదంటే మీ బిడ్డను హత్య చేస్తామని ఆ లేఖలో ఉంది. వెంటనే మృతుడి తండ్రి గోరఖ్ యాదవ్​ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసు బుధవారం రాత్రంతా నిందితుల కోసం వెతికారు. గురువారం ఉదయం కోచింగ్ టీచర్ ఇంట్లోని టాయిలెట్​లో శవమై కనిపించాడు సంస్కార్ యాదవ్. కోచింగ్ టీచర్ మనువడు అరుణ్ శర్మ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. బాలుని గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

12 ఏళ్ళ మైనర్​పై దారుణం:ఝూర్ఖండ్‌.. దుమ్కా జిల్లాలో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలికను ఇద్దరు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం పక్కనే గొడ్డా సమీపంలోని మురికి కాల్వ వద్ద వదిలేశారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు పోలీసులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

బాధితురాలు 6వ తరగతి చదువుతోంది. బుధవారం పాఠశాలకు వెళ్లింది.. పుస్తకాన్ని ఇంట్లో మరిచిపోవండం వల్ల మళ్లీ తిరిగి ఇంటికి వచ్చింది. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు బాలికను అపహరించి నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. ఆరుగురు దుర్మరణం

శిందే నియామకంపై సుప్రీంకు ఉద్ధవ్.. మధ్యంతర ఎన్నికలకు డిమాండ్

ABOUT THE AUTHOR

...view details