బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తనను తానే నిందించుకున్నారు. అధికారి కుటుంబం అసలు రంగును గుర్తించడంలో విఫలమయ్యానని అన్నారు. తూర్పు మెదినీపుర్ జిల్లా కాంతిదక్షిణ్లో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు.
రూ.5,000 కోట్లు విలువైన ఓ సామ్రాజ్యాన్ని అధికారి కుటుంబం నిర్మించిందనే వదంతులను కూడా తాను విన్నానని మమత అన్నారు. తాను మరోసారి అధికారంలోకి వచ్చాక ఆ వ్యవహారంపై దర్యాప్తు చేయిస్తానని చెప్పారు. అధికారి కుటుంబ సభ్యుల్ని నమ్మకద్రోహులుగా అభివర్ణించారు.
" వాళ్ల అసలు రంగును గుర్తించలేకపోయినందుకు నేనో అసమర్థురాలిని. ఆ కుటుంబానికి రూ.5,000 కోట్లతో ఓ సామ్రాజ్యం ఉందని చాలా మంది అంటూ ఉంటారు. కానీ, నాకు దాని గురించి తెలియదు. వాళ్లు డబ్బులతో ఓట్లను కొనుగోలు చేస్తారు. కానీ, వారికి మీరు ఓటు వేయకండి. "