తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ తన ఆస్తుల జాబితాను వెల్లడించారు. తనకు మొత్తం రూ.16.72 లక్షల విలువైన నికర చరాస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. వాహనాలు, స్థిరాస్తులేవీ లేవని స్పష్టం చేశారు.
తగ్గిపోయాయ్
2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీదీ ఆస్తి రూ. 30.45 లక్షలుగా ఉండేది. దీన్ని బట్టి ఈ ఐదేళ్లలో దీదీ ఆస్తులు దాదాపు సగానికి పడిపోయినట్లు తెలుస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దీదీ రూ.10,34,370 ఆదాయాన్ని సంపాదించారు. రూ.930లను పుస్తకాలపై రాయల్టీగా పొందారు. ఈ ఏడాదికి దీదీకి రూ.1.85 లక్షల టీడీఎస్ రావాల్సి ఉంది.