కరోనా విజృంభణ వేళ ఆక్సిజన్ సిలిండర్లను అధిక ధరకు విక్రయించి కొందరు సొమ్ము చేసుకుంటుండగా.. కార్బన్ డై ఆక్సైడ్ సిలిండర్లు విక్రయించి మోసాలకు పాల్పడుతున్నారు మరికొందరు. మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.
జిల్లాలోని ఓ వ్యక్తి ఆక్సిజన్ సిలిండర్ల పేరుతో కార్బన్ డైఆక్సైడ్ నిల్వకు ఉద్దేశించిన ఖాళీ సిలిండర్లు విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సిలిండర్ల వల్ల పేలుడు సంభవిస్తుందని అందులో పేర్కొన్నారు.