తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయికి చేరిన రైతుల 'మహా' ర్యాలీ - మహారాష్ట్ర రైతుల ర్యాలీ

దేశ రాజధాని దిల్లీలో ఆందోళనలు చేస్తోన్న రైతులకు మద్దతుగా.. మహారాష్ట్రలోని నాసిక్​లో చేపట్టిన కిసాన్​ మార్చ్​ ముంబయికి చేరింది. ఈ ర్యాలీలో సుమారు 15000 మంది రైతులు పాల్గొన్నారు. అటు పంజాబ్​లోని లుథియానాలో ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం నాటికి దిల్లీ చేరనున్నట్లు వెల్లడించారు.

Maharashtra: Farmers from Nashik reach Azad Maidan in Mumbai.
Maharashtra: Farmers from Nashik reach Azad Maidan in Mumbai.

By

Published : Jan 24, 2021, 9:30 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతుల చేపట్టిన నిరసనలకు మద్దతుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఆల్​ ఇండియా కిసాన్​ సభ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో రైతులు చేపట్టిన భారీ ర్యాలీ ముంబయికి చేరింది. నాసిక్​ ప్రారంభమైన ఈ ర్యాలీలో 15వేల మంది ప్రజలు పాల్గొన్నారు. వీరంతా.. ముంబయి ఆజాద్ మైదానంలో సోమవారం అన్నదాతలు నిర్వహించనున్న సభలో పాల్గొననున్నారు. ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ సహా మహారాష్ట్ర అధికార కూటమి మహా వికాస్ అఘాడీకి చెందిన ప్రముఖ నేతలు ఈ సభలో పాల్గొననున్నట్లు ఆలిండియా కిసాన్ సభ నాయకులు వెల్లడించారు. అటు పంజాబ్​లోని లుథియానాలోనూ ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించారు. జనవరి 26న దిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.

ముంబయికి చేరిన రైతుల 'మహా' ర్యాలీ
అజాద్​ మైదానంలో రైతులు
ముంబయి రోడ్లపై అన్నదాతలు

భారీ భద్రత నడుమ..

రైతుల సభ సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో సభాస్థలి అయిన అజాద్​ మైదానం వద్ద మహారాష్ట్ర పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ప్రత్యేక పోలీసులు బలగాలను రంగంలోకి దించిన అధికారులు.. ర్యాలీని డేగ కళ్ల(డ్రోన్​)తో పహారా కాస్తున్నారు.

ర్యాలీలో పాల్గొన్న మహిళా రైతులు
రైతులు చేరుకున్న అజాద్ మైదానం
లైట్ల వెలుతురులో అజాద్​ మైదానం

పార్టీల సంఘీభావం..

ఆల్​ ఇండియా కిసాన్​ సభ ఆధ్వర్యంలో మహారాష్ట్ర రైతులు చేపట్టన ఈ ర్యాలీకి 'మహా' నేతలు సంఘీభావం ప్రకటించారు. శరద్​ పవార్​ ఆధ్వర్యంలోని ఎన్​సీపీతో పాటు అధికార శివసేన కూడా మద్దతు ప్రకటించింది. సోమవారం ఇరుపార్టీల నేతలు ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

జనవరి 26న దిల్లీలో రైతులు నిర్వహించనున్న కిసాన్​ పరేడ్​లో ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్​ నుంచి దాదాపు 25000 ట్రాక్టర్లు పాల్గొననున్నాయని భారతీయ కిసాన్​ యూనియన్​ నాయకుడు రాకేష్​ టికాయత్​ శనివారం తెలిపారు. దేశ రాజధానిలో ట్రాక్టర్​ ర్యాలీకి దిల్లీ పోలీసులు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. ర్యాలీ నిర్వహించే మార్గాలను త్వరలో సంయుక్త్​ కిసాన్​ మోర్చా నిర్ణయిస్తుందని తికాయత్​ అన్నారు.

ఇదీ చూడండి: రైతులకు మద్దతుగా మహారాష్ట్రలో కిసాన్​ మార్చ్​

ABOUT THE AUTHOR

...view details