తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతంలో కోత విధించేలా ఓ కొత్త తీర్మానాన్ని ప్రవేశపెట్టింది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా పరిషత్. విధి నిర్వహణలో ఒత్తిడి కారణంగా.. వారిపై అలసత్వం ప్రదర్శిస్తే సంబంధిత సిబ్బంది వేతనంలో 30శాతం కోత విధించాలని ప్రతిపాదించింది.
స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అయితే.. తదుపరి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు మీనా షెల్కే తెలిపారు. తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసుకోని ఉద్యోగులకు ఇదో హెచ్చరిక అవుతుందని ఆమె పేర్కొన్నారు.