Mahadev Betting App Scam Baghel : ఛత్తీస్గఢ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి సీఎం భూపేశ్ బఘేల్కు రూ.508 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయని ఈడీ అధికారులు ఆరోపించడం వల్ల అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. యాప్ నిర్వాహకుల చెల్లించిన డబ్బును ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ ఉపయోగించుకుందని బీజేపీ ఆరోపించింది.
'ఎన్నికల చరిత్రలో ఇలాంటి సాక్ష్యాలను..'
సీఎం భూపేశ్ బఘేల్.. ప్రజల మద్దతుతో కాకుండా బెట్టింగ్ యాప్ ఆపరేటర్ల మద్దతుతో ఎన్నికల్లో పోరాడుతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఎన్నికల చరిత్రలో ఇలాంటి సాక్ష్యాలను ప్రజలు ఎప్పుడూ చూడలేదని విమర్శలు చేశారు. అధికారంలో ఉంటూ భూపేశ్ బఘేల్ బెట్టింగ్ గేమ్ ఆడారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఛత్తీస్గఢ్తోపాటు ఆంధ్రప్రదేశ్లో పోలీసుల దర్యాప్తు వివరాల ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రచారానికి బెట్టింగ్ డబ్బును ఉపయోగించినట్లు నిందితుల వాయిస్ మెసేజ్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
'డబ్బులు అందుకున్న మాట నిజమేనా?'
"ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ గురించి షాకింగ్ నిజాలు.. దేశ ప్రజల ముందు బయటపడ్డాయి. అసిమ్ దాస్ అనే వ్యక్తి నుంచి రూ.5.30 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కాంగ్రెస్ నేతలు.. శుభమ్ సోనీ, అసిమ్ దాస్ ద్వారా డబ్బులు అందుకున్న మాట నిజమేనా? రాయ్పుర్ వెళ్లి ఎన్నికల ఖర్చుగా బఘేల్కు డబ్బులు ఇవ్వాలని అసిమ్కు శుభమ్ ఆదేశించిన విషయం నిజమేనా?" అని స్మృతి ఇరానీ ప్రశ్నించారు.
'కాంగ్రెస్కు అలవాటే!'
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసుపై కేంద్ర మంత్రి రాందాస్ అఠవాలే స్పందించారు."ఇదో పెద్ద అవినీతి... అవినీతికి పాల్పడడం, అధికారంలోకి రావడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్కు అలవాటు. భూపేశ్ బఘేల్ ఆట ముగిసిపోతుంది. జైలుకు వెళ్లాల్సి వస్తుంది. సాక్ష్యాధారాలు దొరికిన తర్వాతే ప్రభుత్వ సంస్థలు విచారణ జరుపుతాయి. కాబట్టి ప్రభుత్వాన్ని నిందించడం మంచిది కాదు. బఘేల్ హయాంలో అవినీతి బాగా పెరిగిపోయింది" అని ఆరోపించారు.
బీజేపీ విమర్శలను ఖండించిన కాంగ్రెస్
మరోవైపు, బీజేపీ చేసిన ఆరోపల్ని కాంగ్రెస్ ఖండించింది. సీఎం భూపేశ్ బఘేల్ ప్రతిష్ఠను దిగజార్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని తీవ్రస్థాయిలో మండపడింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి వ్యూహాలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారని విమర్శించారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ జోస్యం చెప్పారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ప్రజలకు కాంగ్రెస్పై విశ్వాసం ఉందని, బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపణలు చేశారు. బఘేల్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు స్పష్టమైన కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు.
'ఇంతకంటే పెద్ద జోక్ ఉండదు'
ఈడీ ఆరోపణలపై స్పందించిన భూపేశ్ బఘేల్.. ఇంతకంటే పెద్ద జోక్ ఉండదని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ రాజ్యాంగ సంస్థలను ఉపయోగించుకుని పోటీ చేయాలని అనుకుంటోందని ఎద్దేవా చేశారు. తాము కూడా ఎవరో ఒకర్ని పట్టుకుని.. ఆ పట్టుకున్న వ్యక్తి ప్రధాని మోదీ పేరు చెప్తే ఆయనను విచారిస్తారా అని బఘేల్ ప్రశ్నించారు. ఒకరి ప్రతిష్ఠను నాశనం చేయడం చాలా సులభమని అన్నారు.
Bhupesh Baghel Properties : నామినేషన్ వేసిన ఛత్తీస్గఢ్ సీఎం.. బఘేల్ ఆస్తులు ఎంతో తెలుసా?