తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Viral: తాగిన మత్తులో యువకుడి వీరంగం.. చివరకు?

తాగిన మత్తులో ఓ యువకుడు హల్​చల్​ చేశాడు. తలతో ఓ విగ్రహం పైభాగాన్ని పగలగొట్టాలని ప్రయత్నించాడు. మధ్యప్రదేశ్ మురైనాలో జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్​గా మారింది.

By

Published : Jun 18, 2021, 8:04 PM IST

Updated : Jun 18, 2021, 10:09 PM IST

MP, drunk man
తాగిన యువకుడు, విగ్రహం

తాగిన మత్తులో యువకుడి వీరంగం

మద్యం మత్తులో మధ్యప్రదేశ్​కు చెందిన రాము సింగ్ సిసోడియా అనే యువకుడు వీరంగం సృష్టించాడు. మురైనా పోర్సా టెహ్సిల్​ ప్రాంతంలోని స్వాతంత్ర్య సమరయోధుడు సాధు సింగ్ తోమర్​ విగ్రహం పైకి ఎక్కాడు. తలతో విగ్రహం పైభాగాన్ని పగలగొట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు.

విగ్రహం పైకి ఎక్కిన యువకుడు
తలతో విగ్రహం పైభాగాన్ని పగలగొట్టే యత్నం

యువకుడి ప్రవర్తనను చూసి ఓ స్థానికుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. విగ్రహంపై ఉన్న యువకుడిని కర్రతో చితకబాదాడు. అయినప్పటికీ.. రాము కిందకి దిగకుండా విగ్రహాన్ని పగలగొట్టే పనిలో నిమగ్నమయ్యాడు. చివరకు స్థానికుడు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక కిందపడిపోయాడు.

యువకుడిని చితకబాదిన స్థానికుడు

అయితే.. కిందపడిన తర్వాత రాము సింగ్ తలకు గాయమై స్పృహతప్పి పడిపోయాడు. యువకుడిని వెంటనే ఆసుపత్రిగా తరలించారు స్థానికులు. అతడిని కిచౌల్​ గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

ఇదీ చదవండి:రిపబ్లిక్ డే రోజు అంబేడ్కర్ విగ్రహం ముందే కాల్పులు

Last Updated : Jun 18, 2021, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details