తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అలర్ట్ - మీరు ఇంకా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లలేదా? లేదంటే సబ్సిడీ డబ్బులు కట్ - లాస్ట్ డేట్ ఎప్పుడంటే? - LPG Cylinder Biometrics Update

Last Date To Update Biometrics For LPG Cylinder : వంట గ్యాస్‌ కనెక్షన్ ఉన్నవారంతా.. ఏజెన్సీకి వెళ్లిరావాల్సిన టైమ్ వచ్చింది. గడువు త్వరలోనే ముగియనుంది. మరి.. మీరు వెళ్లారా?

Last Date To Update Biometrics For LPG Cylinder
Last Date To Update Biometrics For LPG Cylinder

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 1:56 PM IST

Last Date To Update Biometrics For LPG Cylinder :తెలంగాణలో మొన్నటి వరకు రేషన్‌ కార్డు కలిగిన కుటుంబ సభ్యులు ఈ-కేవైసీ కోసం చౌకధరల దుకాణాల వద్ద బారులుతీరారు. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు వంటగ్యాస్‌ కనెక్షన్‌ కలిగిన వారు కూడా కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) డీటెయిల్స్ సమర్పించాల్సి ఉంది. గ్యాస్‌ కనెక్షన్‌ కలిగిన వ్యక్తి.. సంబంధిత ఏజెన్సీలో ఆధార్‌ కార్డుతో వచ్చి వేలిముద్ర వేయాలని (బయోమెట్రిక్) కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

జనం పరుగులు..
వాస్తవానికి గతనెల నుంచే ఈ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. కానీ, ఎన్నికల నేపథ్యంలో ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నికలు పూర్తి కావడంతో రెండుమూడు రోజులుగా వినియోగదారులు ఏజెన్సీల వైపు పరుగులు తీస్తున్నారు. దీపం, ఉజ్వల, సీఎస్‌ఆర్‌ పథకాలతోపాటు సాధారణ కనెక్షన్‌లు కలిగిన వారు సంబంధిత ఏజెన్సీలో బయోమెట్రిక్‌ నమోదు చేయాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పొందేందుకు.. డిసెంబర్ 31 తేదీలోపు బయోమెట్రిక్ అప్‌డేట్‌ చేయాలి. కానీ.. చాలా మంది కస్టమర్లకు ఇప్పటికీ ఈ సమాచారం గురించి తెలియదు.

ఎవరి పేరున గ్యాస్‌ కనెక్షన్‌ ఉందో.. ఆ వ్యక్తి ఆధార్‌ కార్డుతో వెళ్లి బయోమెట్రిక్‌ యంత్రంలో వేలిముద్ర వేయాలి. దీనికోసం ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన పనిలేదు. ఒకవేళ గ్యాస్ కనెక్షన్‌ పొందిన వ్యక్తి మృతిచెందితే.. రి కుటుంబంలో వేరొకరి పేరు మీదకు కనెక్షన్ మార్చుకోవచ్చు. దీనికోసం గతంలో గ్యాస్‌ కనెక్షన్‌ పొందిన పత్రాలు, పాసుపుస్తకం, ఎవరి పేరున మార్చాలి అనుకుంటున్నారో.. వారి ఆధార్‌, బ్యాంకు ఖాతా, డిపెండెంట్‌ పత్రాలతో సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీకి వెళ్లాలి.

గ్యాస్​ సిలిండర్​కు ఎక్స్​పైరీ డేట్​- ఎలా చెక్​ చేయాలో తెలుసా?

తేలనున్న లెక్కలు..
ప్రస్తుత విధానంలో ఎవరి పేరున ఎన్ని కనెక్షన్‌లు ఉన్నాయన్నది స్పష్టంగా తెలియడం లేదు. కేంద్రం నిర్ణయంతో ఆయా గ్యాస్‌ ఏజెన్సీల్లో ఎంత మందికి కనెక్షన్‌లు ఉన్నాయనే విషయం పక్కాగా తెలుస్తుంది. కొంతమంది రెండు మూడు ఏజెన్సీల్లో కనెక్షన్‌లు పొంది ఉన్నారు. వీరంతా గ్యాస్ కనెక్షన్ తీసుకునే సందర్భంలో.. ఆధార్‌ వివరాలు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు మరోసారి వివరాలు సేకరిస్తుండడంతో.. ఎవరి పేరు మీద ఎన్ని కనెక్షన్‌లు ఉన్నాయనేది తేలనుంది.

అపోహతో పరుగులు..
కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌అని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం వేలిముద్ర వేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం వర్తిస్తుందన్న ప్రచారం ఉంది. దీంతో.. చాలా మంది తెల్లవారుజాము నుంచే గ్యాస్‌ ఏజెన్సీల వద్దకు చేరుతున్నారు. కానీ.. నిజానికి ఈ-కేవైసీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో చేస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకానికి ఎలాంటి సంబంధం లేదని.. ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు.

రూ.500 సిలిండర్ కావాలంటే ఈ కేవైసీ చేయాలంటూ ప్రచారం - బారులు తీరిన జనం

గ్యాస్ స్టౌ నుంచి మంట సరిగా రావట్లేదా? - ఇలా ఈజీగా సెట్ చేయండి!

ABOUT THE AUTHOR

...view details