తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​లో లాలూ ఆడియో టేపుల కలకలం - లాలూ ఆడియో టేప్

బిహార్ రాజకీయాల్లో ఆడియో టేపులు కలకలం రేపాయి. ఓ ఎన్​డీఏ ఎమ్మెల్యేతో మాజీ సీఎం లాలూ ప్రసాద్ మాట్లాడినట్లు ఉన్న ఈ సంభాషణలను భాజపా నేత సుశీల్ మోదీ విడుదల చేశారు. బిహార్​లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని మోదీ ఆరోపించారు.

BH-LALU- SUSHIL
లాలూ

By

Published : Nov 25, 2020, 1:00 PM IST

బిహార్​లో నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని భాజపా నేత సుశీల్ కుమార్ మోదీ ఆరోపించారు. ఆర్​జేడీ అధికారంలో వచ్చేలా ఎన్​డీఏ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

ఇందుకు సంబంధించిన ఓ ఆడియో టేప్​ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు మోదీ. దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి వద్దకు సెల్​ఫోన్​ ఎలా వచ్చిందని మండిపడ్డారు.

"రాంచి నుంచి ఎన్​డీఏ ఎమ్మెల్యేకు లాలూ ప్రసద్ ఓ నంబర్​ నుంచి ఫోన్​ చేసి మాట్లాడారు. ఆయనకు మంత్రి పదవులు ఇస్తామని హామీలు ఇచ్చారు.

నేను అదే నంబర్​కు కాల్​చేసి మాట్లాడాను. లాలూనే నేరుగా ఫోన్ లిఫ్ట్ చేశారు. జైలులో ఉండి ఇలా పనులు చేయవద్దని.. మీరు గెలవలేరని చెప్పా."

- సుశీల్ కుమార్ మోదీ

సుశీల్​ మోదీ విడుదల చేసిన ఆడియో టేపులో సంభాషణలు ఇలా..

లాలూ:పాసవాన్ జీ నమస్తే.. మీరు వినండి.. రేపు స్పీకర్​ ఎన్నిక ఉంది. మీరు మాకు మద్దతు ఇవ్వండి. మిమ్మల్ని మంత్రిని చేస్తాం.

పాసవాన్: పార్టీలో ఉన్నా కదండి..

లాలూ: ఆ రోజు మీరు రావొద్దు.. కరోనా వచ్చిందని చెప్పండి. స్పీకర్​ మన వారు ఉంటే అప్పుడు చూసుకోవచ్చు కదా.

ఇదీ చూడండి:మతాలకు అతీతం.. అయోధ్య 'సత్యార్థ్​​'​ ఆలయం

ABOUT THE AUTHOR

...view details