తెలంగాణ

telangana

By

Published : May 29, 2022, 4:02 PM IST

ETV Bharat / bharat

చదువుకు అడ్డురాని వైకల్యం.. ఒంటికాలిపై స్కూల్​కు బాలుడు..

student goes to school by one leg: అన్ని అవయవాలు ఉన్న చదువును అశ్రద్ధ చేస్తున్న నేటి సమాజంలో.. చదువుకోవాలనే తపనతో ఒంటి కాలుతోనే పాఠశాలకు వెళుతున్నాడు ఓ విద్యార్థి. జమ్ముకశ్మీర్​కు చెందిన మహ్మద్​ పర్వేజ్ ప్రమాదంలో కాలు కోల్పోయిన నిరాశ పడకుండా రెండు కిలోమీటర్లు గెంతుకుంటూ వెళ్లి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.​

student goes to school by one leg
student goes to school by one leg

వైకల్యాన్ని ఎదిరించిన బాలుడు

student goes to school by one leg: చదువుకోవాలనే తపన ఉంటే వైకల్యం కూడా అడ్డు రాదని నిరూపిస్తున్నాడు ఓ బాలుడు. ప్రమాదంలో కాలు కోల్పోయినా నిరాశ చెందకుండా తాను అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాడు. చదువుకోవడానికి అనేక కిలోమీటర్ల దూరం ప్రయాణించి పాఠశాలకు చేరుకుంటున్నాడు.

జమ్ముకశ్మీర్​ కుప్వారా జిల్లాలోని హంద్వారాకు చెందిన మహ్మద్​ పర్వేజ్​కు చాలా ఏళ్ల క్రితం ప్రమాదంలో కాలు కాలిపోయింది. అనేక శస్త్ర చికిత్సలు చేసినా..ప్రయోజనం లేదు. చివరకు పర్వేజ్​ కాలును తొలగించారు వైద్యులు. దీంతో అప్పటినుంచి ఒంటికాలితోనే జీవిస్తున్నాడు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న పర్వేజ్​.. ఒక్క కాలితోనే గెంతుకుంటూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు నడిచి వెళుతున్నాడు. తనకు ప్రభుత్వం వీల్​చైర్​ను ఇచ్చినా.. తమ గ్రామంలోని రోడ్డుపై నడిచే పరిస్థితి లేదంటున్నాడు పర్వేజ్. అందుకే నడిచి వస్తున్నాని చెప్పాడు. చదడమే కాకుండా తన మిత్రులతో కలిసి క్రికెట్​, వాలీబాల్​ లాంటి క్రీడలన్నీ ఆడుతున్నాడు.

"2009లో జరిగిన ప్రమాదంలో నా కాలు కాలిపోయింది. చదువుకోవడానికి రెండు కిలోమీటర్లు దూరం మిత్రులతో కలిసి వస్తాను. భవిష్యత్తులో డాక్టర్​ అయ్యి మా గ్రామానికి మంచి పేరు తెస్తాను."
- మహ్మద్ పర్వేజ్​​, విద్యార్థి

పర్వేజ్​కు కృత్రిమ కాలు అమర్చే ఆర్థిక స్తోమత తన వద్ద లేదని అతడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పర్వేజ్​కు చదువుకోవడం అంటే ఇష్టమని.. అందుకే ఎన్ని సమస్యలు ఎదురైనా రోజు పాఠశాలకు వెళతాడని అతడి తండ్రి తెలిపాడు. దయనీయ పరిస్థితుల్లో ఉన్న తనను ప్రభుత్వమే ఆదుకోవాలని పర్వేజ్​ విజ్ఞప్తి చేస్తున్నాడు.

కృత్రిమ కాలుతో సీమా

మరోవైపు, అచ్చం ఇలానే ఒంటికాలితో గెంతుకుంటూ స్కూల్​కు వెళుతూ వైరల్​గా మారిన బాలికకు కృతిమ కాలును అమర్చారు. బిహార్ జముయీ జిల్లా ఖైరా బ్లాక్​లోని ఫతేపుర్ గ్రామంలో ఉండే సీమాకు రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోయింది. దీనిపై అనేక మంది దాతలు స్పందించారు. తాజాగా బిహార్​ ఎడ్యూకేషన్​ ప్రాజెక్ట్​ కౌన్సిల్​ బాలికకు కృతిమ కాలును కానుకగా ఇచ్చింది. కృతిమ కాలు అమర్చడం వల్ల ఆమె నడుస్తూ పాఠశాలకు వెళ్లనుంది. తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది సీమా.

ఇదీ చదవండి: వైకల్యంపై ఒంటికాలి పోరాటం... పదేళ్ల బాలిక సంకల్పం భేష్!

ABOUT THE AUTHOR

...view details