హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళాలో కరోనా కేసులు వెలుగుచూస్తున్న వేళ ముంబయి మేయర్ కిశోరీ పెడ్నేకర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కుంభమేళా భక్తులు కరోనా వైరస్ను ప్రసాదంలా అందరికి పంచుతారని అన్నారు. ఈ భక్తులను భాజపా ప్రేరేపిస్తోందని ఆరోపించారు.
కరోనా మరింత వ్యాపించకుండా నివారించేందుకు కుంభమేళా భక్తులను క్వారంటైన్కు పంపిస్తామని మేయర్ పెడ్నేకర్ వెల్లడించారు. క్వారంటైన్ ఖర్చులను భక్తులే భరించాలని స్పష్టం చేశారు.