తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ పాల్గొనే వెబినార్​కు 'కిన్నాల్​' కళాకారులు - కర్ణాటక కొప్పల్ జిల్లా

వైవిధ్యాలకు నెలవైన భారతదేశంలో విభిన్న కళారూపాలు, హస్తకళలు పురుడుపోసుకున్నాయి. అనాదిగా వస్తోన్న ఈ కళల్లో ప్రతీది ప్రత్యేకమే. వీటన్నింటిలో కర్ణాటక కొప్పల్ జిల్లాలోని 'కిన్నాల్ హస్తకళ'ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిందే. ప్రపంచానికి అందమైన బొమ్మలను అందిస్తున్న ఈ నైపుణ్యం అంతర్జాతీస్థాయిలో గుర్తింపు పొందనుంది. దిల్లీ వెబినార్​లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Koppala's glorious Kinnala Craft heads towards to glister in Delhi's Webinar
కిన్నాలా బొమ్మలు

By

Published : Feb 23, 2021, 7:30 AM IST

అరుదైన హస్తకళలకు నిలయం.. 'కిన్నాల' గ్రామం

కర్ణాటకలోని కొప్పాల జిల్లా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 'కిన్నాల్​ హస్తకళా' నైపుణ్యానికి నెలవైన కిన్నాల గ్రామ ఖ్యాతి మరింత పెరగనుంది. ఈ నెల 27న జరిగే వెబి‌నార్‌లో పాల్గొనేందుకు 15 మంది కిన్నాల్​ కళాకారులు ఎంపికయ్యారు. వీరంతా.. దిల్లీలో నిర్వహించబోయే బొమ్మల ఆన్​లైన్​ ప్రదర్శన, విక్రయాల్లో పాల్గొంటారు. డిజిటల్ వేదిక ద్వారా కిన్నాల చారిత్రక వారసత్వం అంతర్జాతీయంగా ఆవిష్కృతం కానుంది.

కళకు గుర్తింపు..

దిల్లీలో ఈ నెల 27 నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించబోయే వెబినార్​లో ఈ కళకు ప్రత్యేక స్థానం కల్పించారు. తద్వారా ఈ కళకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భిన్న కళాకారులతో కిన్నాల్​ కళాకారులు వేదిక పంచుకోనున్నారు.

ఈ వెబినార్​కి ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ.. కిన్నాల్​ కళాకారులతో ప్రత్యేకంగా చర్చించనున్నట్టు సమాచారం.

పురాతన కళ..

పురాతన కళ అయిన చెక్కబొమ్మల తయారీకి కిన్నాల గ్రామం ప్రసిద్ధి. ఈ బొమ్మలను తయారు చేసేవారిని 'చిత్రగరస్' అంటారు. కర్ణాటకలోని ప్రసిద్ధ ఆలయాల్లోని కుడ్య చిత్రాలు, హంపిలోని చెక్క రథంపై ఉన్న క్లిష్టమైన శిల్పాలు తమ పూర్వీకుల పనితనానికి నిదర్శనమని కిన్నాల్​ కళాకారులు చెబుతారు.

చేతులు లేకున్నా.. కాళ్లతో రాస్తూ ఇంటర్​లో టాపర్​

కళ్లకు గంతలతో పజిల్​ పూర్తి..13 ఏళ్లకే రికార్డులు

అంతర్జాతీయ స్థాయిలో..

కలపతో తేలికపాటి బొమ్మలను సహజ రంగుల్లో, ఆకర్షణీయంగా మలచడంలో కిన్నాల్ కళకు సాటిలేదని ప్రతీతి. ఐరోపా, మధ్యప్రాచ్య దేశాలతో పాటు.. దక్షిణాసియా ప్రాంతంలో ఈ బొమ్మలకు మంచి పేరుంది. దేశీయంగానూ కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, బంగాల్​లలో విపరీత ప్రాచుర్యం పొందింది.

తగ్గుతోన్న ప్రాచుర్యం..

మొదట్లో కిన్నారపురం అని పిలిచే ఈ గ్రామం.. కాలక్రమేనా 'కిన్నాల'గా మారింది. ఈ బొమ్మల తయారీలో ఉపయోగించే కలప తేలికగా మారేందుకు నీటిలో నానబెట్టి, ఎండబెడతారు. ఆపై దేవతలు, జంతువులు సహా వివిధ కళాఖండాలు రూపొందిస్తారు. సాధారణంగా కిన్నాల్ కళల్లో ఎక్కువగా.. కామధేనువు, హనుమంతుడు, గరుడ, శివ-పార్వతులు, గణేశుల విగ్రహాలు ఉంటాయి. పండ్లు, కూరగాయలతో పాటు స్త్రీ, పురుషులు, పిల్లల బొమ్మలూ ఉంటాయి. ఈ బొమ్మలకు డిమాండ్ తగ్గిన కారణంగా గ్రామంలో చాలా కుటుంబాలు ఇతర వృత్తుల్లో స్థిరపడ్డాయి.

ఇవీ చూడండి:

ఆ అమ్మవారికి 'రాళ్లే' నైవేద్యం!

ఎంత ఎత్తున్నా సులువుగా ఎక్కేస్తాడు 'కోతిరాజ్'​

మూడేళ్లకే 163 దేశాల పేర్లు ఇట్టే చెప్పేస్తోంది

భూలోక స్వర్గాన్ని తలపించే అద్దాల మేడ

ఒకేసారి 3 మతాల కీర్తనలు- సోదరభావానికి ప్రతీకలు!

ABOUT THE AUTHOR

...view details