బంగాల్లో ముగ్గురు ఉగ్రవాద అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ కోల్కతాకు సమీపంలోని హరిదేవ్పూర్ ప్రాంతంలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు బంగాల్ పోలీసులు తెలిపారు. వారు బంగ్లాదేశ్కు చెందిన జమాత్ ఉల్ ముజాహిదీన్ సంస్థ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నట్లు చెప్పారు.
గత కొన్ని నెలలుగా కోల్కతాలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు సమాచారం రాగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి వ్యక్తిగత ఫేస్బుక్ వివరాలతో పాటు ఓ డైరీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డైరీలో జమాత్ ఉల్ ముజాహిదీన్కు చెందిన ముఖ్యనేతలకు సంబంధించి కీలక సమాచారం ఉన్నట్లు వెల్లడించారు. వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు విచారణ జరుపుతున్నట్లు వివరించారు.
యూపీలో ఇద్దరు..