తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హైదరాబాద్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎమ్మెల్యే మృతి

Kolhpur north mla: అనారోగ్యం బారినపడి హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్రకాంత్ జాదవ్ గురువారం ఉదయం కన్నుమాశారు. మహారాష్ట్రలోని కొల్హాపుర్ ఉత్తర నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

By

Published : Dec 2, 2021, 2:01 PM IST

Chandrakant Jadhav passes away
కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్రకాంత్ జాదవ్

Kolhpur north mla: మహారాష్ట్ర కొల్హాపుర్​ ఉత్తర ఎమ్మెల్యే, కాంగ్రెస్​ నేత చంద్రకాంత్ జాదవ్(57)​ ఇక లేరు. అనారోగ్యం బారినపడి హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్​ నుంచి కొల్హాపుర్​కు చంద్రకాంత్ జాదవ్ భౌతికకాయాన్ని తరలించారు.

congress mla chandrakant jadhav: కొల్హాపుర్ ఉత్తర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రకాంత్ పోటీ చేశారు. ఎన్నికల్లో శివసేన పార్టీ అభ్యర్థి రాజేశ్ క్షీరసాగర్​ను ఓడించి ఆయన ఎమ్మెల్యే పదవి చేపట్టారు. కొల్హాపుర్​లోని వివిధ కుస్తీ శిక్షణ కేంద్రాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

అనతి కాలంలో వివిధ మంచి పనులు చేసి ప్రజల మన్నన పొందారు చంద్రకాంత్ జాదవ్​. అయితే.. ఇటీవల ఆయన ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కాగా.. హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. గతంలో రెండు సార్లు ఆయన కరోనా బారిన పడి కోలుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం అనారోగ్యం కారణంగా ఆయన పరిస్థితి విషమించి.. ఆస్పత్రిలోనే మృతి చెందారు.

ఇదీ చూడండి:సముద్రంలో మునిగిన 15 పడవలు- మత్స్యకారులు గల్లంతు

ఇదీ చూడండి:క్షణాల్లోనే జీవితాలు తారుమారు- బస్సు, లారీ ఢీకొని ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details