తెలంగాణ

telangana

By

Published : Mar 10, 2021, 4:33 PM IST

ETV Bharat / bharat

'అల్ ​బదర్​​ ఉగ్రసంస్థ చీఫ్​ హతం గొప్ప విజయం'

జమ్ముకశ్మీర్​లో మార్చి 9న జరిగిన ఎన్​కౌంటర్​లో అల్​ బదర్​ ముష్కర సంస్థ నాయకుడు గని ఖవాజాను చంపడం గొప్ప విజయమని ఆ రాష్ట్ర పోలీసులు అన్నారు. భద్రతా బలగాలు నిర్భంద తనిఖీలు చేపట్టిన క్రమంలో ఉగ్రమూకలు కాల్పులకు తెగబడగా.. జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఖవాజా హతమయ్యారు.

Killing of Al Badr chief a major success: Police
'అల్​​ బద్ర​ ఉగ్రసంస్థ చీఫ్​ను​ చంపడం పెద్ద విజయం'

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్​కౌంటర్​లో అల్​ బదర్​ ఉగ్రముఠా చీఫ్ గని ఖవాజా​ను మట్టుబెట్టడం గొప్ప విజయంగా అభివర్ణించారు ఆ రాష్ట్ర ఐజీ విజయ్​ కుమార్​. భద్రతా బలగాలు, ముష్కరులు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో గని హతమయ్యాడు. నియంత్రణ రేఖ ప్రాంతాల్లోని యువకులను ఉగ్రవాద సంస్థల్లో చేర్చుకోవడం, కొత్త ముష్కర బృందాలను తయారు చేయడంలో గని కీలక పాత్ర పోషిస్తున్నాడని విజయ్​ కుమార్​ తెలిపారు.

"తుజ్జార్​ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంతో సోపోర్​ పోలీసులు నిర్భంద తనిఖీలు చేపట్టారు. అనంతరం సీఆర్​పీఎఫ్​, ఆర్మీ సిబ్బంది వారితోపాటు తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది కళ్లు కప్పి పారిపోవడానికి, ఖవాజా సహా మరో ఇద్దరు ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఖావాజాను మట్టుబెట్టాయి "

- విజయ్​ కుమార్​, జమ్ముకశ్మీర్​ ఐజీ

జమ్ముకశ్మీర్​ నుంచి ఖవాజా 2000 సంవత్సరంలో పాకిస్థాన్​కు పారిపోయాడు. 2002లో తిరిగి దేశంలోకి ప్రవేశించిన ఖవాజాను 2007లో పోలీసులు అరెస్టు చేశారు. 2008లో విడుదల చేశారు. అప్పటి నుంచి 2015 వరకు ఓవర్​ గ్రౌండ్​ వర్కర్​గా పని చేశాడు. 2018 జనవరిలో హిజ్బుల్​ ముజాహిదీన్​లో చేరి ఉగ్రకార్యకలాపాలు నిర్వహించాడు. అనంతరం 2020లో అల్​ బదర్​ చీఫ్​గా ఎదిగాడు.

ఇదీ చూడండి:లోయలో పడ్డ బస్సు- 8 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details