తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Kerala Corona Cases: కేరళలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

కేరళలో కరోనా కేసులు(Kerala Corona Cases) మళ్లీ పెరిగాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 9,361 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. మరో 99 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో 378 మందికి కరోనా నిర్ధరణ అయింది. మరో 11 మంది మరణించారు.

By

Published : Oct 22, 2021, 8:25 PM IST

kerala corona cases
కేరళలో కరోనా కేసులు

కేరళలో కరోనా రోజువారీ కేసులు(Kerala Corona Cases)క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 9,361 మంది.. వైరస్(Kerala Corona Cases) బారిన పడినట్లు తేలింది. వైరస్ ధాటికి​(Kerala Covid Cases News) మరో 99 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజా కేసులతో కలిపి, కేరళలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 48,88,678కి చేరింది. మరణాల సంఖ్య 27,765కు పెరిగింది. మరో 9,855 మంది కోలుకోగా యాక్టివ్ కేసుల సంఖ్య 80,892కు పడిపోయింది.

వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసులు ఇలా..

  • కర్ణాటకలో కొత్తగా 378 కరోనా కేసులు నమోదయ్యాయి. 464 మంది కోలుకోగా.. 11 మంది మృతి చెందారు.
  • ఒడిశాలో కొత్తగా 467 మందికి కరోనా సోకగా.. మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
  • బంగాల్​లో 883 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. 14 మంది మరణించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details