తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Kashmir Encounter: కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు ముష్కరులు హతం

Kashmir Encounter: కశ్మీర్​లోని షోపియాన్​ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఘటనాస్థలంలో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు అధికారులు తెలిపారు.

By

Published : Dec 25, 2021, 11:22 AM IST

Updated : Dec 25, 2021, 12:05 PM IST

kashmir encounter
షోపియన్​ ఇద్దరు ఉగ్రవాదులు హతం

Kashmir Encounter: కశ్మీర్​లో ఉగ్రవాదులు- భద్రతా దళాల మధ్య ఎన్​కౌంటర్​ శనివారం జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుపెట్టారు. షోపియాన్​లోని చౌగామ్​ ప్రాంతంలో ఈ ఎన్​కౌంటర్​ జరిగింది. ఘటనాస్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

షోపియాన్​ ఎన్​కౌంటర్​
ఘటనాస్థలంలో భద్రతా సిబ్బంది
షోపియాన్​లో ఎన్​కౌంటర్

మృతిచెందిన ముష్కరులు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని వెల్లడించారు పోలీసులు. వీరిలో ఒకరు ఇదివరకే అనేక సార్లు ప్రజలపై దాడులకు పాల్పడగా.. మరొకరు ఇటీవల సంస్థలో చేరినట్లు పేర్కొన్నారు. ఎన్​కౌంటర్​ నేపథ్యంలో సెర్చ్​ ఆపరేషన్​ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి :'దేశం పేరు చెప్పినప్పుడు గర్వంగా అనిపించింది'

Last Updated : Dec 25, 2021, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details