Karnataka CM Emotional: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం తన సొంత నియోజకవర్గం షిగ్గౌన్ ప్రజలతో భావోద్వేగపూరితంగా మాట్లాడారు. ఈ ప్రపంచంలో పదవులు, అధికారాలు సహా ఏదీ శాశ్వతం కాదని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. బొమ్మై వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
"ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ జీవితం ఎప్పటికీ ఉండదు. మనం ఇలా ఎంతకాలం ఉంటామో ఎవరికీ తెలియదు. ఈ పదవులు, అధికారాలు కూడా శాశ్వతం కావు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని నేను ఎల్లప్పుడూ నడుచుకుంటాను."
-బసవరాజ్ బొమ్మై, కర్ణాటక సీఎం
Basavaraj bommai in his constituency: తాను బసవరాజ్ను మాత్రమేనని ముఖ్యమంత్రి కాదని బొమ్మై పేర్కొన్నారు. షిగ్గౌన్లో కిట్టూర్ రాణి విగ్రహాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. "ఈ ప్రాంతంలో కాకుండా బయట నేను గతంలో హోంమంత్రి, సాగునీటి శాఖ మంత్రిగా పని చేశాను. కానీ, నేను ఎప్పుడు ఇక్కడకు వచ్చినా బసవరాజ్ను మాత్రమే. ఎందుకంటే పదవుల కంటే బసవరాజ్ మాత్రమే శాశ్వతంగా ఉంటారు" అని బొమ్మై పేర్కొన్నారు.