తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రూ.52కోట్లు తీసుకొని మిగతా డబ్బు ఇచ్చేయండి' - kanpur businessman piyush jain

Kanpur Raids Piyush Jain: రూ.వందల కోట్ల అక్రమ నగదుతో పట్టుబడ్డ కాన్పుర్​ వ్యాపారవేత్త పీయూష్​ జైన్​.. తన డబ్బును తిరిగి ఇవ్వాలంటున్నాడు. జీఎస్టీ అధికారులు సీజ్​ చేసిన నగదులో రూ.52కోట్లు పెనాల్టీ కింద కట్​ చేసుకొని మిగతా మొత్తాన్ని ఇవ్వాలని ప్రాతిపాదించాడు. ఈమేరకు అధికారులు కోర్టుకు తెలిపారు.

Kanpur raids, పీయూష్ జైన్​
రూ.52కోట్లు తీసుకొని మిగతా డబ్బు ఇచ్చేయండి

By

Published : Dec 30, 2021, 3:51 PM IST

Kanpur Raids Piyush Jain: పన్ను ఎగవేసి వందల కోట్ల రూపాయల అక్రమ నగదుతో పట్టుబడ్డ కాన్పుర్ వ్యాపారవేత్త పీయూష్​ జైన్​ జీఎస్టీ అధికారుల ముందుకు ఓ ప్రతిపాదన తీసుకొచ్చాడు. సీజ్ చేసిన నగదులో పన్ను, జరిమానా కింద రూ.52 కోట్లు తీసుకొని మిగతా డబ్బు తిరిగివ్వాలని కోరాడు. ఈ మేరకు కోర్టులో అధికారులు వెల్లడించారు.

జైన్​ కేసులో డైరెక్టర్​ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్​ (DGGI) తరఫున స్పెషల్ పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ అమ్రిష్​ టాండన్​ కోర్టులో వాదనలు వినిపించారు. పన్ను ఎగవేశానని జైన్ ఒప్పుకున్నారని, రూ.52కోట్లు పెనాల్టీగా చెల్లించాల్సి ఉందని అంగీకరించాలని వివరించారు.

అయితే జైన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్​ నివాసాల్లో సీజ్​ చేసిన నగదులో రూ.52కోట్లు పెనాల్టీగా తీసుకొని మిగతా డబ్బును మొత్తం తిరిగి ఇవ్వాలని డీజీజీఐని ఆదేశించాలని కోరారు. దీనిపై స్పందించిన అమ్రిష్ టాండన్​.. పన్ను ఎగవేత కింద సీజ్​ చేసిన డబ్బును తిరిగి ఇవ్వడం కుదరదని, కావాలంటే జైన్ అదనంగా మరో రూ.52కోట్లు పెనాల్టీగా చెల్లించాలని చెప్పారు. అందుకు DGGI అంగీకరిస్తుందని కోర్టుకు తెలిపారు.

Piyush Jain News

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పన్ను ఎగవేత ఆరోపణలతో జైన్ నివాసాల్లో ఇటీవలే సోదాలు జరిపిన జీఎస్టీ అధికారులు కుప్పలుకుప్పలుగా పడి ఉన్న రూ.195 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక 23కేజీల బంగారం, రూ.6 కోట్లు విలువ చేసే చందనం నూనెను జైన్​ వద్ద గుర్తించారు. అనంతరం అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ విధించింది న్యాయస్థానం. జైన్ అరెస్టుపై ఉత్తర్​ప్రదేశ్​లో రాజకీయ దుమారం చెలరేగింది. భాజపా, ఎస్పీ పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. అదే సమయంలో రికవరీ చేసిన డబ్బును టర్నోవర్ మొత్తంగా పేర్కొంటూ DGGI కేసును బలహీనం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది.

ఈ ఆరోపణలు జీఎస్టీ అధికారులు ఖండించారు. తాము రికవరీ చేసిన నగదును టర్నోవర్​గా చూపలేదని, అది అసత్య ప్రచారమని స్పష్టం చేశారు. ఈ మొత్తం నగదను భారతీయ స్టేట్ బ్యాంకులో భద్రపరిచామని, తదుపరి విచారణ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు అధికారికి ప్రకటన విడుదల చేశారు.

Kanpur Businessman Piyush jain

పన్ను ఎగవేత కేసులో పీయూష్​ జైన్​ను డిసెంబర్​ 26న అరెస్టు చేసి ఆ మరునాడే కోర్టులో పరిచారు అధికారులు.

ఇదీ చదవండి: 'డొక్కు స్కూటర్​, రబ్బరు చెప్పులతో తిరిగి రూ.వందల కోట్లు దాచాడా?'

పీయూష్ జైన్​ ఫ్యాక్టరీలో 23కిలోల బంగారం, 600 కిలోల చందనం నూనె

ABOUT THE AUTHOR

...view details