తెలంగాణ

telangana

లాలూకు బెయిల్- జైలు నుంచి విముక్తి!

పశువుల దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్​కు బెయిల్ లభించింది. మొత్తం నాలుగు కేసుల్లో ఆయన దోషిగా తేలగా.. ఇదివరకే మూడు కేసుల్లో బెయిల్ వచ్చింది.

By

Published : Apr 17, 2021, 1:16 PM IST

Published : Apr 17, 2021, 1:16 PM IST

Updated : Apr 17, 2021, 1:23 PM IST

lalu bail
లాలూ బెయిల్

పశువుల దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దుమ్కా ట్రెజరీ నుంచి అక్రమంగా నిధులను మళ్లించిన కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చింది.

దాణా కుంభకోణానికి సంబంధించి నాలుగు కేసుల్లో లాలూకు శిక్ష ఖరారైంది. ఇందులో మూడింటికి ఇప్పటికే బెయిల్ లభించింది. తాజా బెయిల్​తో.. జైలు నుంచి విడుదలయ్యేందుకు లాలూకు మార్గం సుగమమైంది.

ఇదీ చదవండి:'టీఎంసీ విచ్ఛిన్నం.. దీదీ ఓటమే తరువాయి!'

Last Updated : Apr 17, 2021, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details