తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 5:27 PM IST

Updated : Sep 22, 2023, 6:42 PM IST

ETV Bharat / bharat

JDS Joins NDA Alliance Party : NDAలోకి జేడీఎస్‌.. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో కలిసే పోటీ

JDS Joins NDA Alliance Party : భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో కర్ణాటక పార్టీ జేడీఎస్‌ అధికారికంగా చేరింది.

JDS Joins NDA Alliance Party
NDA JDS Meet 2023

JDS Joins NDA Alliance Party :కర్ణాటకకు చెందిన​ జనతా దళ్ సెక్యూలర్​(జేడీఎస్​).. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో అధికారికంగా చేరింది. బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డాలతో భేటీ అనంతరం జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఎన్డీయేలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ తాజా పరిణామంతో కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్‌ మధ్య పొత్తు పొడుపులపై గత కొన్నాళ్లుగా వస్తోన్న వార్తలకు ముగింపు పలికినట్లయింది. కాగా, కర్ణాటకలో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. రెండు పార్టీల పొత్తు ప్రకటనకు ముందు జరిగిన కీలక భేటీలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ కూడా పాల్గొన్నారు.

'మోదీ విజన్​ మరింత బలంగా!'
ఈ చేరికతో ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌ మరింత బలోపేతమవుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. అమిత్‌ షా సమక్షంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి సమావేశమయ్యారని నడ్డా ట్విట్టర్​ వేదికగా తెలిపారు. ఎన్డీయేతో కలిసి జేడీఎస్‌ పనిచేసేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. జేడీఎస్‌ను హృదయపూర్వకంగా తమ కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్లు నడ్డా పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఎన్డీయేను, ప్రధాని నరేంద్ర మోదీ 'న్యూ ఇండియా, స్ట్రాంగ్‌ ఇండియా' విజన్‌ను మరింత బలోపేతం చేస్తుందని ఆయన ట్వీట్‌ చేశారు.
అభివృద్ధి చెందిన భారత్‌పై మోదీజీకి ఉన్న నమ్మకం ఉంచి జేడీ(ఎస్) ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేను భావిస్తున్నానానని కేంద్ర హోం మంత్రి అమిత్​షా పేర్కొన్నారు.

"ఎన్‌డీఏ కుటుంబంలోకి జెడీ(ఎస్)ను నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ పొత్తు కర్ణాటకను అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. అలాగే బలమైన ఎన్‌డిఏతో బలమైన భారతదేశానికి ఈ మార్గం సుగమం చేస్తుంది."
- అమిత్​ షా, కేంద్రమంత్రి.

పొత్తుకు మాజీ సీఎం సంకేతాలు..
ఇటీవలే జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన జేడీఎస్‌.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని గతంలో చెప్పింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ సీనియర్‌ నేత, మాజీ సీఎం యడియూరప్ప లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌, బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. జేడీఎస్​కు మాండ్యతో పాటు మరో మూడు లోక్‌సభ సీట్లు ఇస్తామని కూడా ఆయన ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఇరు పార్టీల మధ్య పొత్తు తథ్యమేనని పలురకాల ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ ఇరు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి.

Last Updated : Sep 22, 2023, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details