తెలంగాణ

telangana

By

Published : Dec 25, 2021, 5:25 AM IST

ETV Bharat / bharat

కశ్మీర్​లో హిజ్బుల్​ ఉగ్రవాది హతం- ఇద్దరు అనుచరుల అరెస్ట్​

Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్​లో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరోవైపు ఇద్దరు ఉగ్ర అనుచరులను అరెస్టు చేసి వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Security forces
భద్రతా దళాలు

Jammu Kashmir Encounter: పోలీసులు, సామాన్య పౌరులపై దాడి జరిపిన ఓ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా దళాలు. కశ్మీర్​లోని అనంత్​నాగ్​ జిల్లాలో ఉగ్రవాదిని హతం చేసినట్లు స్పష్టం చేశాయి. భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్​లో మృతిచెందిన ఉగ్రవాదిని షహ​జాద్ అహ్మద్​గా గుర్తించారు అధికారులు.

'తొలుత ఉగ్రవాదులు బిజ్​బెహారాలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు షహ​జాద్​ను గుర్తించి అతడిని లొంగిపొమ్మని కోరారు. దీనికి నిరాకరించిన అతడు.. భద్రతా దళాలపై కాల్పులు జరిపాడు. తిరిగి సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు.' అని ఓ అధికారి తెలిపారు.

గతంలో షహ​జాద్.. పోలీసు అధికారి మహ్మద్ అష్రఫ్ భట్​ను, కొందరు పౌరులను హతమార్చడంలో ముఖ్యపాత్ర పోషించాడని అధికారి పేర్కొన్నారు. షహజాద్.. కొందరికి ఆయుధాలు కూడా సరఫరా చేసినట్లు ఆధారాలున్నాయని తెలిపారు.

ఇద్దరు అరెస్టు..

జమ్ముకశ్మీర్​లోని బుద్గాంలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్ర అనుచరులను కూడా అరెస్టు చేశాయి భద్రతా దళాలు. వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.

మాగ్రే మొహల్లా మోచ్వాకు చెందిన ఉగ్ర అనుచరులను ఇమ్రాన్ మజీద్ మాగ్రే, ఆకిబ్ ఆమిన్​గా గుర్తించారు అధికారులు. వారి నుంచి రెండు ఏకే-47 తుపాకులను, 30 లైవ్ ఏకే-47 రౌండ్స్​, రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Militants Firing: రెచ్చిపోయిన ఉగ్రమూక- పోలీస్​పై కాల్పులు

కశ్మీర్​లో ఇద్దరు ఉగ్ర అనుచరులు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details