తెలంగాణ

telangana

By

Published : Jun 26, 2021, 10:32 AM IST

Updated : Jun 26, 2021, 11:17 AM IST

ETV Bharat / bharat

ఏకే-56తో లొంగిపోయిన ముష్కరుడు

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో సందర్భంగా లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాది ఏకే-56 రైఫిల్‌తో లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.

Shopian encounter Terrorist surrenders with AK-56 rifle
ఉగ్రదాడి-ఏకే-56తో లొంగిపోయిన ముష్కరుడు

జమ్ముకశ్మీర్‌ షోపియన్ జిల్లా హంజీపోరా వద్ద ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది మృతి చెందినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో మరో ముష్కరుడు ఏకే-56 తుపాకీతో లొంగిపోయినట్లు వివరించారు. నిర్ధిష్ట సమాచారం మేరకు పోలీసులు, సైన్యం ఈ సంయుక్త ఆపరేషన్​ను నిర్వహించాయి.

ఉగ్రవాదులు లొంగిపోవాల్సిందిగా కోరుతున్న జవాన్లు
ఉగ్రవాదులు లొంగిపోవాల్సిందిగా కోరుతున్న జవాన్లు

లష్కరే తోయిబా ఉగ్రవాదులు నక్కిన ప్రదేశానికి భద్రతా దళాలు చేరుకోగానే ముష్కరులు భారీ కాల్పులకు తెగబడ్డారని.. దీంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్లు సైన్యం ప్రకటించింది. ఇతర ముష్కరుల కోసం అన్వేషణ కొనసాగుతున్నట్లు తెలిపింది.

ఇవీ చదవండి:

Last Updated : Jun 26, 2021, 11:17 AM IST

ABOUT THE AUTHOR

...view details