తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​లో 63.93% తగ్గిన ఉగ్రదాడులు'

జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడులు తగ్గాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే 2020లో ఉగ్రదాడులతో పాటు ప్రత్యేక బలగాల, దేశ పౌరుల మరణాలు తగ్గాయని హోంశాఖ వార్షిక నివేదికలో పేర్కొంది.

By

Published : Jan 11, 2021, 1:38 PM IST

J-K witnessed 63.93 pc decrease in terrorist incidents in 2020: MHA
కశ్మీర్​లో 63.93శాతం తగ్గిన ఉగ్రదాడులు

గతేడాది జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడులు తగ్గినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే 2020 (జనవరి నుంచి నవంబరు 15వరకు) ముష్కరదాడులు 63.93శాతం తగ్గాయని హోంశాఖ సాధించిన వార్షిక విజయాలపై విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

'హోం శాఖ కీలక విజయాలు'

  • కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లో కేంద్ర, రాష్ట్ర చట్టాలను అమలు చేయడం.
  • 2019తో పోల్చుకుంటే ఉగ్రదాడులు 63.93శాతం తగ్గడం. ప్రత్యేక బలగాల మరణాలు 29.11శాతం, పౌరుల మరణాలు 14.28శాతం తగ్గడం.
  • జమ్ముకశ్మీర్​లో 48 కేంద్ర, 167 రాష్ట్ర చట్టాలను అమలు చేయడం ముఖ్య విజయాల్లో ఒకటి. లద్దాఖ్​లోనూ 44 కేంద్ర, 148 రాష్ట్ర చట్టాల అమలు చేశారు.
  • జమ్ముకశ్మీర్​ పునర్వవ్యస్థీకరణ ఆర్డర్​-2020ని అమలు చేశారు. దీంతో జమ్ముకశ్మీర్​ పునర్వవ్యస్థీకరణ చట్టం-2019లోని సెక్షన్ 75లోని కొన్ని ఇబ్బందులు తొలగిపోయాయి.
  • జమ్ముకశ్మీర్, లద్దాఖ్​ ఉమ్మడి హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులను నియమించి ప్రమాణ స్వీకారం చేయించారు.
  • 2020 జూన్​ 6న జమ్ములో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్​ ధర్మాసనం ఏర్పాటు.

పాక్​ ఆక్రమిత జమ్ముకశ్మీర్, ఛాంబ్ నుంచి దేశంలోకి వచ్చిన 36,384 శరణార్థుల కుటుంబాలకు ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద ప్రతి కుటుంబానికి రూ.5.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు హోంశాఖ తెలిపింది.

ఇదీ చూడండి:ఉగ్రవాదుల సైబర్​ వలలో కశ్మీరీ యువత!

ABOUT THE AUTHOR

...view details