తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర- ట్రాక్​పై అడ్డంగా ఇనుప ముక్క, కర్రలు! - రైలు పట్టాలపై ఇనుప రాడ్డు కర్ణాటక

Iron block on Train Track In Karnataka : రైలును పట్టాలు తప్పించేందుకు ముగ్గురు వ్యక్తులు ట్రాక్​పై ఇనుప ముక్క, కర్రను ఉంచారు. దీన్ని గమనించి అప్రమత్తమైన లోకో పైలట్..​ రైలును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. కర్ణాటకలో జరిగిందీ ఘటన.

wooden blocks on the 06275 express train track in mysore :
wooden blocks on the 06275 express train track in mysore :

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 7:18 AM IST

Updated : Nov 16, 2023, 9:58 AM IST

Iron block on Train Track In Karnataka :చామరాజనగర్​-మైసూర్​ ఎక్స్​ప్రెస్​ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైలును పట్టాలు తప్పించడానికి కొందరు దుండగులు కుట్ర పన్నడం కలకలం రేపింది. పట్టాలకు అడ్డంగా ఇనుప ముక్క, కర్రను ఉంచారు. వాటిని గమనించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశాడు. నవంబర్ 12 సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకునన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

ఇదీ జరిగింది..
నవంబర్ 12 వ తేదీ సాయంత్రం 06275 నంబర్ గల ఎక్స్​ప్రెస్ రైలు చామరాజనగర్ నుంచి మైసూరుకు బయలుదేరింది. ​ఈ క్రమంలో కర్ణాటకలోని నంజన్​గుడు, కడకోల రైల్వే స్టేషన్​ల మధ్య కొందరు దుండగులు రైలు ట్రాక్​పై ఇనుప ముక్క, కర్రను ఉంచారు. వీటిని గమనించిన లోకోపైలట్.. వెంటనే అప్రమత్తమై​ రైలును నిలిపివేశాడు. దీంతో వేలాది మంది ప్రయాణీకులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కారణంగా రైలు కొంత సమయం నిలిచిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సోమయ్ మారాండి అనే వ్యక్తితో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన సహచరులతో కలసి ఈ నేరానికి పాల్పడినట్లుగా నిందితుడు సోమయ్​ అంగీకరించాడు. ముగ్గురు నిందితులపై రైల్వే చట్టం 1989 కింద కేసు నమోదు చేశారు.

లోకోపైలట్​కు అభినందనలు..
లోకోపైలట్ సమయస్పూర్తి వల్ల అనేక మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా లోకోపైలట్​ను డివిజినల్ రైల్వే మేనేజర్ శిల్పి అగర్వాల్ అభినందించారు. ప్రయాణికుల భద్రత యోగక్షేమాలును ఆయనని అడిగి తెలిసుకున్నారు. రైలు ట్రాక్​లపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇలాంటి ఘటన ఈ ఏడాది ఆగస్టులో జరిగింది. అహ్మదాబాద్​-పురీ రైలుతో పాటు మరో ట్రైన్​కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైళ్లను పట్టాలు తప్పించడానికి గుర్తుతెలియని వ్యక్తులు కుట్ర పన్నారు. పట్టాలకు అడ్డంగా ఇనుప స్తంభాలను ఉంచారు. పైలట్​ల అప్రమత్తతో రెండు రైళ్లకు ప్రమాదం తప్పింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకునన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం కోసంఈ లింక్​పై క్లిక్ చేయండి.

Agra Train Accident : రైలులో ఒక్కసారిగా మంటలు.. రెండు బోగీలు దగ్ధం

గేదెను ఢీకొట్టిన ప్యాసెంజర్ రైలు- పట్టాలు తప్పిన బోగీ

Last Updated : Nov 16, 2023, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details