తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చొరబాటు కుట్ర భగ్నం- ముగ్గురు జవాన్లకు గాయాలు - militants infiltration in Uri

జమ్ముకశ్మీర్​లో ఉగ్రమూకలు చొరబాటుకు వరుసగా విఫలయత్నాలు చేస్తున్నాయి. తాజాగా కొందరు ఉగ్రవాదులు ఉరీ సెక్టార్​లోని నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నించగా.. భారత ఆర్మీ వారి కుట్రను భగ్నం చేసింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

Indian Army
భారత జవాన్లు

By

Published : Sep 26, 2021, 10:38 AM IST

జమ్ము కశ్మీర్​లోని ఉరీ సెక్టార్​లోని నియంత్రణ రేఖ (ఎల్​ఓసీ) వద్ద ఉగ్రవాదులు మరోసారి చొరబాటుకు యత్నించారు. ఉగ్రవాదుల కదలికలను తెలుసుకున్న ఆర్మీ.. సమర్థంగా వారిని అడ్డుకుంది. ముష్కరుల ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో ముగ్గురు భారత జవాన్లు గాయపడ్డారు. శనివారం సాయంత్రం జరిగిందీ ఘటన.

'కొంత మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ​ (ఎల్​ఓసీ) వద్ద చొరబాటుకు యత్నించారు. వారంతా భారీ ఆయుధ సామగ్రితో సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించి అప్రమత్తమయ్యాం' అని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు.

అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆర్మీ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ప్రయత్నంలో విజయవంతంగా ఉగ్రవాదులను తరిమికొట్టగలిగారు. అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంతకుముందు కూడా సెప్టెంబర్​ 18న కొంత మంది ఉగ్రవాదులు ఇదే ప్రాంతంలో చొరబాటుకు విఫలయత్నం చేశారు. అయితే అప్రమత్తమైన ఆర్మీ చేపట్టిన ఆపరేషన్​తో​ ఉగ్రమూకలు తోక ముడిచాయి.

ఇదీ చదవండి:kakori conspiracy: స్వాతంత్య్రోద్యమంలో విస్మృత వీరనారి.. రాజ్​కుమారి

ABOUT THE AUTHOR

...view details